...
...
Next Story

తిరుపతి ఐఐఎస్‌ఈఆర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల.. ఈ మెయిల్ ద్వారా అప్లికేషన్!

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jun 22, 2026 10:24 PM IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER Tirupati) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్‌లోని పలు పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రీసెర్చ్ వాతావరణంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం.

తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు
తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు

నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్‌ ఆఫీసర్‌ / సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్-1 విభాగానికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సైన్స్/ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ (B.E/B.Tech) లేదా పీజీ (M.Sc/M.Tech) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత లాబొరేటరీ లేదా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో 2 నుండి 4 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి వయోసడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి నెలకు గరిష్ఠంగా రూ. 57,000 వరకు వేతనం (నెలవారీ గౌరవ వేతనం + హెచ్‌ఆర్‌ఏ నిబంధనల ప్రకారం) చెల్లిస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం అప్లికేషన్ల స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ

ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవ పత్రాలను స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.

  • ఈమెయిల్ ఐడీ: projectstaffrecruitment@labs.iisertirupati.ac.in
  • దరఖాస్తుకు ఆఖరి తేదీ: 26-06-2026

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌‌సైట్ వెళ్లండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe