తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే నవంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి ఉంటుందని పేర్కొంది.నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ ఉండగా… నవంబర్ 9న కార్తీక వన భోజనం నిర్వహిస్తారు. నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం ఉంటుంది.
నవంబర్ నెలలో విశేష పర్వదినాలు:

• నవంబర్ 1న ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
• నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ.
• నవంబర్ 9న కార్తీక వన భోజనం.
• నవంబర్ 15న సర్వ ఏకాదశి.
• నవంబర్ 17న ధన్వంతరి జయంతి.
• నవంబర్ 18న మాస శివరాత్రి.
• నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం.
వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం:
తిరుమలలో ఇవాళ వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది.
భజనమండళ్ల సభ్యులు అలిపిరి పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.
ఇవాళ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు ధార్మిక సందేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.నవంబరు 1న ఉదయం 8.30 గంటలకు సామూహిక నామ సంకీర్తన, ఉదయం 9.30 గంటల నుండి స్వామిజీలు ధార్మిక సందేశము ఇవ్వనున్నారు.
పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని చెబుతారు.
{{/usCountry}}పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని చెబుతారు.
{{/usCountry}}