NBK112 Budget: నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర అస్సలు తగ్గడం లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ను లైన్ లో పెడుతూ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 111వ సినిమా (NBK111) షూటింగ్తో బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా తన నెక్స్ట్ మైల్స్టోన్ ప్రాజెక్ట్ 'NBK112' ను అధికారికంగా ప్రారంభించారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా ఎంటర్టైనర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురువారం (జూన్ 25) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనంగా జరిగింది.
నారా లోకేష్ క్లాప్
ఈ ఎన్బీకే 112 మూవీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ చెప్పారు. పూజా కార్యక్రమాలతో సినిమాను చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తన మామ బాలయ్యపై లోకేష్ తొలి క్లాప్ ఇవ్వడం విశేషం.
క్లాప్ ఇవ్వగానే బాలయ్య తన మార్క్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. బ్యాక్గ్రౌండ్ లో జై బాలయ్య నినాదాలు మార్మోగాయి. ఈ ఈవెంట్ కు బాలకృష్ణ సాంప్రదాయ దోతీ, కుర్తా, కండువాతో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సమ్మర్ 2027 రేస్ లోకి బాలయ్య..
ఈ సినిమా ఓపెనింగ్ వేడుకకు ముందే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఎస్ఎల్వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఇదొక బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా నిలిచిపోబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
"ఈ సినిమాను ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా కొరటాల శివ డిజైన్ చేశారు. దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్మర్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం" అని సుధాకర్ చెరుకూరి లీక్ ఇచ్చారు.
{{/usCountry}}"ఈ సినిమాను ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా కొరటాల శివ డిజైన్ చేశారు. దాదాపు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్మర్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం" అని సుధాకర్ చెరుకూరి లీక్ ఇచ్చారు.
{{/usCountry}}ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్తో 'NBK112' సినిమా సమ్మర్ 2027 బాక్సాఫీస్ రేసులోకి అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చేసింది. బాలయ్యకు పోటీగా సమ్మర్ బరిలో నిలవబోయే ఆ ఇతర టాలీవుడ్ పెద్ద సినిమాలు ఏంటనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
కొరటాల శివ మార్క్ సోషల్ డ్రామా..
'మిర్చి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన కొరటాల శివ.. బాలయ్య బాడీ లాంగ్వేజ్కు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక హై-వోల్టేజ్ స్క్రిప్ట్ను రెడీ చేసినట్లు సమాచారం. సమాజంలో జరిగే ఒక ముఖ్యమైన అంశాన్ని బేస్ చేసుకుని, దానికి బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ కథను నెక్స్ట్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్తో పాటు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా కో-ప్రొడ్యూస్ చేస్తోంది. సినిమాలో నటించబోయే హీరోయిన్, విలన్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ లాంటి టెక్నికల్ క్రూ వివరాలను చాలా త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని మేకర్స్ చెప్పారు.
బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా పూర్తి కావడమే ఆలస్యం.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మెగాస్టార్స్, యంగ్ లీడర్స్ సమక్షంలో ప్రారంభమైన ఈ మూవీ టాలీవుడ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ మైల్స్టోన్ హిట్గా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.