...
...
Next Story

ఆల్రెడీ హీరోలు ఉన్నారు నువ్వెందుకురా అనుకోవచ్చు.. ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేయండి సిస్టర్స్: బిగ్ బాస్ అమర్‌దీప్

బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరోగా వస్తున్నాడు. సుమతి శతకం అనే సినిమాలో అతడు లీడ్ రోల్ ప్లే చేయగా.. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 29, 2026 09:06 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మరో బిగ్ బాస్ ఫేమ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతని పేరు అమర్‌దీప్ చౌదరి. అతడు నటించిన మూవీ సుమతీ శతకం. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (జనవరి 29) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అమర్‌దీప్ మాట్లాడుతూ.. తాను హీరోగా ఎందుకు వస్తున్నానో ఈ సినిమా చూస్తే తెలుస్తుందని అనడం విశేషం.

అమర్‌దీప్ ఏమన్నాడంటే?

ఆల్రెడీ హీరోలు ఉన్నారు నువ్వెందుకురా అనుకోవచ్చు.. ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేయండి సిస్టర్స్: బిగ్ బాస్ అమర్‌దీప్
ఆల్రెడీ హీరోలు ఉన్నారు నువ్వెందుకురా అనుకోవచ్చు.. ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేయండి సిస్టర్స్: బిగ్ బాస్ అమర్‌దీప్

అమర్‌దీప్, శైలి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ సుమతీ శతకం. ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్లో అమర్‌దీప్ మాట్లాడాడు. “నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. నాది అనంతపురం. అక్కడి నుంచి చిన్నగా మొదలుపెట్టి అలా అలా పైకి ఎదిగాను. మీకు రామ్ గా పరిచయం అయ్యాను. ఆల్రెడీ ఇంత మంది హీరోలు ఉన్నారు నువ్వెందుకురా అనుకోవచ్చు. నేను ఎందుకో ఈ సినిమాలో ఫుల్ సమాధానం ఉంది. ఇది కాదు లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్. అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఇంచ్ బై ఇంచ్ నేను చాలా కష్టపడి పని చేశాను” అని అమర్‌దీప్ అన్నాడు.

సుమతీ శతకం మూవీ ట్రైలర్

సుమతీ శతకం మూవీ ట్రైలర్ ఫన్నీగా సాగిపోయింది. పెళ్లి కోసం పరితపించే యువకుడి పాత్రలో అమర్‌దీప్ నటించాడు. అతని పెళ్లికి, గుడిలో అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోవడానికి ఉన్న లింకేంటో ఈ సినిమాలో చూడొచ్చు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా రూపొందించిన సినిమా ఈ సుమతీ శతకం. ఎంఎం నాయుడు రచన, దర్శకత్వం వహించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe