జర్మనీలో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థి కష్టాల గురించి పంచుకున్న పోస్ట్ ఇంటర్నెట్లో వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి విదేశాలకు వెళ్ళే విద్యార్థులు ఎదుర్కొనే మానసిక, ఆర్థిక పోరాటాలను ఆ విద్యార్థి పృథ్వీమేష్ పాటిల్ ఇన్స్టాగ్రామ్లో చాలా వ్యక్తిగతంగా, హృదయానికి హత్తుకునేలా రాశారు. సోషల్ మీడియాలో అందరూ ఊహించే 'కలల జీవితం' వెనుక దాగి ఉన్న ఓర్పు, త్యాగం, అదృశ్య పోరాటాల గురించి ఆయన చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తల్లి మాటతో కన్నీళ్లు ఆగలేదు

“సంతోషం పతాక స్థితిలో ఏడవడం, దుఃఖం పతాక స్థితిలో నవ్వడం – ఈ మాట అన్నది ఎవరో కానీ అది అక్షరాలా నిజం” అంటూ పృథ్వీమేష్ తన పోస్ట్ మొదలుపెట్టారు.
“చివరికి, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది నాన్నా” అని తన అమ్మ ఫోన్లో చెప్పిన వెంటనే, తాను ఎంతగానో కష్టపడ్డానని అంగీకరించిన ఆ క్షణం... పృథ్వీమేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కానీ, లేదా నెలల తరబడి కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు కానీ ఏడవని తాను, తల్లిదండ్రుల నుండి లభించిన ఈ ఆదరణకు, నమ్మకానికి భావోద్వేగానికి గురయ్యానని ఆయన వివరించారు.
అద్దెకు దొరకక, స్కామ్లకు బలి
ఈ పోస్ట్కు జతగా, పృథ్వీమేష్ తన ప్రయాణాన్ని తెలియజేసే చిన్న వీడియో క్లిప్ల మాంటేజ్ను కూడా షేర్ చేశారు. “4 సూట్కేసులు, పెద్ద కలలతో” ఉద్యోగాన్ని వదిలి జర్మనీకి వెళ్లడం మొదలుకుని, “ఒకే ఒక్క బాత్రూమ్తో 9 మంది ఒకే అపార్ట్మెంట్లో” ఇరుకు వసతిలో నెట్టుకురావడం వరకు తన ప్రస్థానాన్ని చూపించారు.
ఆ క్లిప్లో, తాను బతకడం కోసం చేసిన పార్ట్టైమ్ ఉద్యోగాలను కూడా వివరించారు.
- గంటకు 8 యూరోల కోసం రెస్టారెంట్ కిచెన్లు, టాయిలెట్లను శుభ్రం చేయడం.
- గడ్డకట్టే చలిలో గ్రాసరీ డెలివరీలు చేయడం.
- జీతాలు ఆలస్యం లేదా అసంపూర్తిగా వచ్చే గిడ్డంగులు, సూపర్ మార్కెట్లలో పనిచేయడం.
‘ఒక ల్యాండ్లార్డ్ చేతిలో మోసపోయి, చాలా డబ్బు కోల్పోయాను. కొద్దికాలం పాటు ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డా’నని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత కానీ తనకు రెసిడెన్స్ పర్మిట్ దొరకలేదన్నారు. 300కు పైగా ఇంటర్న్షిప్ దరఖాస్తులు తిరస్కరణకు గురైనా, చివరకు ఒక్క ఆఫర్ దొరికిందని, ఆ శుభవార్తను తల్లిదండ్రులకు చెప్పే సమయంలో “కన్నీళ్లు ఆపుకోలేకపోయానని” ఆయన పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి కథ ఇదే
{{/usCountry}}‘ఒక ల్యాండ్లార్డ్ చేతిలో మోసపోయి, చాలా డబ్బు కోల్పోయాను. కొద్దికాలం పాటు ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డా’నని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల తర్వాత కానీ తనకు రెసిడెన్స్ పర్మిట్ దొరకలేదన్నారు. 300కు పైగా ఇంటర్న్షిప్ దరఖాస్తులు తిరస్కరణకు గురైనా, చివరకు ఒక్క ఆఫర్ దొరికిందని, ఆ శుభవార్తను తల్లిదండ్రులకు చెప్పే సమయంలో “కన్నీళ్లు ఆపుకోలేకపోయానని” ఆయన పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి కథ ఇదే
{{/usCountry}}తాను కేవలం తన గురించే కాకుండా, “సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి, కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి వచ్చిన ప్రతి అంతర్జాతీయ విద్యార్థి కథ”ను చెప్పాలనుకుంటున్నానని పృథ్వీమేష్ తన క్యాప్షన్లో రాశారు.
“ప్రజలు సోషల్ మీడియాలో మంచి క్షణాలను మాత్రమే చూసి, మనం ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నామని అనుకుంటారు. కానీ ఏదీ ఉచితంగా రాదు.. ప్రతి కలకూ మూల్యం ఉంటుంది” అని గట్టిగా చెప్పారు.
తనకు మద్దతు ఇచ్చిన స్నేహితులకు ధన్యవాదాలు చెబుతూ, ఇది "కేవలం ప్రారంభం మాత్రమే" అని ముగించారు. కొందరికి ఇది చిన్న మైలురాయిలా అనిపించవచ్చు, కానీ 18 ఏళ్ల వయస్సులో ఉన్న తనను ఊహించుకుంటే ఇది అద్భుతమైన ప్రగతి అని ఆయన తెలిపారు.
సోషల్ మీడియా స్పందనలు
పృథ్వీమేష్ పోస్ట్ ఆన్లైన్లో వేలాది మంది విద్యార్థులతో కనెక్ట్ అయింది. ఒక నెటిజన్ స్పందిస్తూ, “ఈ పోస్ట్ వేలాది మంది యువ వలసదారులు, విద్యార్థులకు స్ఫూర్తిని ఇచ్చింది” అని రాశారు.
మరొకరు, “నాకు 'ఎస్' అనే ఒక్క ఆఫర్ వచ్చే ముందు 625 దరఖాస్తులు చేశాను... ఇది వెలకట్టలేనిది! అభినందనలు!” అని పంచుకున్నారు.
మరొక యూజర్, “అభినందనలు! అవును, జర్మనీకి వచ్చి, చదువుకుని, పనిచేసి, విజయం సాధించాలనుకున్న ఎంతో మంది భారతీయుల కథ ఇది. కష్టాలను ఎదుర్కొని, అడుగడుగునా ముందుకు సాగి జీవితంలో సక్సెస్ సాధించిన తోటి భారతీయులందరికీ మళ్లీ అభినందనలు!” అని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
“ఈ అద్భుతమైన వీడియో షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా మంది జీవితాలను, వారి వాస్తవాలను తెలియజేశారు. ఇక్కడ రొమాంటిసైజ్ చేసింది ఏమీ లేదు. ప్రజలు చూడవలసిన విషయం ఇది. మీ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని ఒక యూజర్ రాశారు.