హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశుల్లో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. దీనినే 'నిర్జల ఏకాదశి' అంటారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీన నిర్జల ఏకాదశి వచ్చింది. "ఏడాది పొడవునా ఉండే మిగతా ఏకాదశి వ్రతాలను ఆచరించలేని వారు, కేవలం ఈ ఒక్క రోజు నియమబద్ధంగా ఉపవాసం ఉంటే చాలు.. 24 ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.
వ్రత సంకల్పం - కఠిన నియమాలు

ఈ రోజున కనీసం నీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండాలి. అందుకే దీనికి నిర్జల ఏకాదశి అనే పేరు వచ్చింది. వ్రతం ఆచరించే వారు ఉదయాన్నే లేచి, స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ సంకల్పం తీసుకోవాలి. "స్వామి.. కేశవా.. నీ ప్రసన్నత కోసం నేను ఈ రోజు ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉంటాను. కేవలం ఉదయం ఆచమనం నీటిని మాత్రమే స్వీకరిస్తాను," అని మనసులో ప్రార్థించాలి.
తిరిగి ద్వాదశి రోజున విష్ణుపూజ ముగించుకుని వ్రత పారణ చేయాలి. ఎండలు ఎక్కువగా ఉండే జ్యేష్ఠ మాసంలో నీరు ముట్టకుండా ఉపవాసం చేయడం కఠినమైన పరీక్షే అయినా, దీని వల్ల లభించే ఫలితం అద్భుతం. ఈ రోజు సాయంత్రం శ్రీహరి నామస్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.
పద్మపురాణం ప్రకారం దానాల విశిష్టత
నిర్జల ఏకాదశి రోజున పూజలతో పాటు దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర దినాన దానాలు చేసే వారిని శ్రీహరి అనుగ్రహిస్తారు. పద్మపురాణంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ రోజున 'జలమయి ధేనువు', 'ఘృతామయి ధేనువు' దానం చేయడం వల్ల అనంత పుణ్యం లభిస్తుంది.
శ్రీమహావిష్ణువు జలంలో శయనించే సమయం కాబట్టి, ఆయనను భక్తితో అర్చించి ఆవును దానం ఇవ్వాలి. ఒకవేళ గోదానం చేయలేని పరిస్థితి ఉంటే.. గోవుతో సమానమైన నీటిని లేదా నెయ్యిని పాత్రల్లో ఉంచి దానం చేయవచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే కాలం కాబట్టి, బాటసారులకు, ప్రజలకు త్రాగునీరు అందించడం అత్యుత్తమ పుణ్యకార్యం. బ్రాహ్మణులకు వస్త్రాలు, దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెడితే విష్ణుమూర్తి మోక్షాన్ని ప్రసాదిస్తారు.
{{/usCountry}}శ్రీమహావిష్ణువు జలంలో శయనించే సమయం కాబట్టి, ఆయనను భక్తితో అర్చించి ఆవును దానం ఇవ్వాలి. ఒకవేళ గోదానం చేయలేని పరిస్థితి ఉంటే.. గోవుతో సమానమైన నీటిని లేదా నెయ్యిని పాత్రల్లో ఉంచి దానం చేయవచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే కాలం కాబట్టి, బాటసారులకు, ప్రజలకు త్రాగునీరు అందించడం అత్యుత్తమ పుణ్యకార్యం. బ్రాహ్మణులకు వస్త్రాలు, దక్షిణ ఇచ్చి వారిని సంతోషపెడితే విష్ణుమూర్తి మోక్షాన్ని ప్రసాదిస్తారు.
{{/usCountry}}"నిర్జల ఏకాదశి నాడు భక్తిశ్రద్ధలతో విష్ణుపూజ చేసి, రాత్రంతా జాగరణ ఉంటూ దానధర్మాలు చేసే వారు తమతో పాటు తమ పూర్వీకుల వంద తరాలను, రాబోయే వంద తరాలను వైకుంఠానికి చేర్చినవారవుతారు," అని పౌరాణిక గ్రంథాలు వివరిస్తున్నాయి.
ఏ వస్తువులు దానం చేయాలి?
నిర్జల ఏకాదశి రోజున కేవలం నీరు, నెయ్యి మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
దానం చేయాల్సిన ముఖ్యమైన వస్తువులు:
అన్నదానం: ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది.
వస్త్రాలు, పరుపులు: బ్రాహ్మణులకు లేదా పేదలకు దుస్తులు, పరుపులు, అందమైన ఆసనాలు దానం చేయవచ్చు.
గొడుగు, చెప్పులు: ఎండ నుంచి రక్షణ కల్పించే గొడుగు, పాదరక్షలను దానం చేయడం వల్ల శ్రీహరి కృప లభిస్తుంది.
కమండలం: పూజా కార్యాచరణకు ఉపయోగపడే కమండలాన్ని ఇవ్వడం శుభప్రదం.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం పౌరాణిక గ్రంథాలు, ఆధ్యాత్మిక నమ్మకాలపై ఆధారపడి ఉంది. దీనిని సాధారణ సమాచారం కోసమే ఇస్తున్నాం. భక్తులు తమ నమ్మకాలకు అనుగుణంగా వీటిని అనుసరించవచ్చు.