ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవాలను పక్కనపెట్టగా... ఈ దశలో 3,752 పంచాయతీలకు సర్పంచ్, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఈ మూడో విడత కింద 394 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోనూ 3,752 సర్పంచి స్థానాలకు 12,652 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 36,425 వార్డులకుగాను 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 28,410 వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.
ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈటైమ్ దాటితే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. కానీ ఈ సమయంలోపు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. గంటపాటు భోజన విరామం తర్వాత.... కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది.
సాయంత్రం వరకు ఫలితాలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. మరోవైపు సర్పంచ్ ఓట్లను కూడా లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే.... ఇదే సమయంలో ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. వార్డుల్లో గెలిచిన అభ్యర్థుల్లో ఒకరిని ఉపసర్పంచ్ గా ఎన్నుకుంటారు.
కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఈసీ ఆదేశించింది. చెల్లని ఓట్ల నిర్ధారణపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించింది. రీకౌంటింగ్ అవసరమైతే అందుకనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.
ఇక మూడో విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరంలో ఉన్న చాలా మంది ఓటర్లు తరలివెళ్లారు. శనివారం నగరంలో రద్దీ ఎక్కువగా కనిపించింది. ఎల్బీ నగర్ - నాగార్జున సాగర్ వైపు వెళ్లే రోడ్డుపై రద్దీ నెలకొంది. మరికొన్ని ప్రధాన రహదారుల్లో కూడా ఇదే మాదిరి పరిస్థితి కనిపించింది.
మూడో విడత ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 ఉదయం 10 గంటల వరకు ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు చేపట్టరాదని ఈసీ ఆదేశించింది. పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను నివారించేందుకు పోలీసులు ఆదేశాలు ఇచ్చింది.
{{/usCountry}}మూడో విడత ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18 ఉదయం 10 గంటల వరకు ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు చేపట్టరాదని ఈసీ ఆదేశించింది. పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలను నివారించేందుకు పోలీసులు ఆదేశాలు ఇచ్చింది.
{{/usCountry}}