...
...
Next Story

TG IIIT Admissions 2026 : బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు - దరఖాస్తు విధానం, విద్యార్థుల ఎంపిక ఇలా...

బాసర ఐఐఐటీ ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Mar 22, 2026, 11:06:33 IST
Advertisement

తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసరతో పాటు మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

బాసర ఐఐఐటీలో ప్రవేశాలు
బాసర ఐఐఐటీలో ప్రవేశాలు

ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కోసం ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 10వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుల స్వీకరణ (పోస్ట్ ద్వారా) ప్రాసెస్ మే 20తో ముగుస్తుంది. ఎంపికైన వారి జాబితాను మే 30వ తేదీన ప్రకటిస్తారు.

ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు - దరఖాస్తు విధానం ఇలా…

  • ముందుగా https://www.rgukt.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని యూజీ అడ్మిషన్స్ - 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ నొక్కాలి. ఇక్కడ బోర్డు, హాల్ టికెట్ , మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • ఆ తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ/బీసీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. ఇక ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.450, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1,500గా నిర్ణయించారు.
  • విద్యార్థి వివరాలతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాలి.
  • చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఇక జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జూన్ 5 న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. విద్యార్థులు సాధించే మార్కుల ఆధారంగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

అర్హతలు - ఎంపిక విధానం ఇలా:

  • రాష్ట్రంలోని ఐఐఐటీ క్యాంపస్ ల్లో ప్రవేశాల కోసం పదో తరగతి రెగ్యూలర్ విద్యార్థులు అప్లయ్ చేసుకునేందుకు అర్హులవుతారు.
  • బాసరలోని 1650 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్‌ లోనూ ఐఐఐటీ క్యాంపస్ లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.
  • మొత్తం సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకు, 15 శాతం అన్-రిజర్డ్వ్‌ కోటాలో కేటాయిస్తారు.
  • మహిళా అభ్యర్థులకు అన్ని కేటగిరీలలో 33 శాతం హారిజంటల్‌ రిజర్వేషన్ ఉంటుంది.
  • ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది.
  • వయోపరిమితి 01.06.2026 నాటికి 18 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
  • ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. అంటే మొత్తం 24 అదనపు మార్కులు జోడిస్తారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.
  • ఒకవేళ ఇద్దరు విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు.
  • సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఐఐఐటీ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks