రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా… త్వరలో ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది.

రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి పరిధిలోని మున్సిపల్, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోనూ ఈ వివరాలను ఉంచారు.
జనవరి 10న ఫైనల్ లిస్ట్…
117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కలిపి 45 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, 500 మంది థర్డ్జెండర్లు ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాపై జనవరి 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
పాలకవర్గం గడువు పూర్తి అయిన మున్సిపాలిటీల్లో 2,690, కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ కార్పొరేషన్లో 66 వార్డులు ఉండగా, మిగతా 5 కార్పొరేషన్లలో 60 చొప్పున వార్డులు ఉన్నాయి. ఇక జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 50 వార్డులు.. ఆదిలాబాద్, కామారెడ్డిలో 49 చొప్పున వార్డులున్నాయి.
మున్సిపాలిటీల పరిధిలోని ఓటర్లు… ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారి పరిధిలోని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెెళ్లొచ్చు. ఈనెల 4వ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు సమావేశమవుతారు. జనవరి 10వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
ఇప్పటికే గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత…. మరింత వేగం పెరిగే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}ఇప్పటికే గడువు ముగిసిన మున్సిపాలిటీలకు ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత…. మరింత వేగం పెరిగే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}