హైదరాబాద్ నగరవాసులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఈసారి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఈ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్ హెచ్చరించారు.

సైబర్ నేరగాళ్లు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ మెసేజ్లు, ఎస్ఎమ్ఎస్లు పంపడం లేదా నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. 'మీ వాటర్ బిల్లు అప్డేట్ కాలేదు, మీ మీటర్ రీడింగ్ నమోదు కాలేదు, లేదా మీ 'క్యాన్' (CAN - Consumer Account Number) వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది.' అంటూ నమ్మిస్తారు.
నిబంధనల ప్రకారం వెంటనే వివరాలు అప్డేట్ చేయకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తామని బెదిరింపులకు దిగుతారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే తాము పంపే లింక్ ద్వారా APK ఫైల్స్ లేదా క్విక్ సపోర్ట్ (Kwik Support) వంటి రిమోట్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు.
నమ్మకం కుదిరించడం కోసం కేవలం రూ.10, రూ.13 లేదా రూ.20 రూపాయలు మాత్రమే ఆన్లైన్లో కట్టాలని నేరగాళ్లు చెబుతారు. వినియోగదారులు ఆ రిమోట్ యాప్ను ఇన్స్టాల్ చేయగానే, వారి ఫోన్ స్క్రీన్ బ్లాంక్ అయిపోవడం లేదా హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నేరగాళ్లు బాధితుల ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
మరికొందరిని వీడియో కాల్స్ ద్వారా తప్పుదోవ పట్టిస్తూ, వారి యూపీఐ, బ్యాంకింగ్ యాప్స్లో తాము చెప్పినట్లు చేయాలని సూచిస్తారు. వారు చెప్పినట్లు చేయగానే క్షణాల వ్యవధిలో బాధితుల బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుండి లక్షలాది రూపాయలు మాయమవుతున్నాయని డీసీపీ వెల్లడించారు.
వాటర్ బోర్డు అధికారుల పేరిట వచ్చే ఇలాంటి మోసపూరితమైన మెసేజ్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. వాటర్ బిల్లులు చెల్లించడానికి లేదా స్టేటస్ తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ HMWSSB అధికారిక వెబ్సైట్ లేదా 'My HMWSSB' మొబైల్ యాప్ను మాత్రమే ఉపయోగించండి.
{{/usCountry}}వాటర్ బోర్డు అధికారుల పేరిట వచ్చే ఇలాంటి మోసపూరితమైన మెసేజ్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. వాటర్ బిల్లులు చెల్లించడానికి లేదా స్టేటస్ తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ HMWSSB అధికారిక వెబ్సైట్ లేదా 'My HMWSSB' మొబైల్ యాప్ను మాత్రమే ఉపయోగించండి.
{{/usCountry}}వాట్సాప్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా వచ్చే ఎలాంటి ఏపికె (.apk) ఫైల్స్ ఇన్స్టాల్ చేయవద్దు. ఇవి మీ ఫోన్ డేటాను దొంగిలించే మాల్వేర్లు. వాటర్ బోర్డు సిబ్బంది ఎన్నడూ మీ ఫోన్కు వచ్చే ఓటీపీ, ఏటీఎం పిన్ లేదా క్రెడిట్ కార్డ్ వెనుక ఉండే సివివి నంబర్లను అడగరని గుర్తుంచుకోండి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఏ అధికారీ వాటర్ కనెక్షన్ను రాత్రికి రాత్రే తొలగించలేరు. కాబట్టి కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దు.