తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు మందగించడంతో రాగల వారంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాధారణంగా జూలై మాసంలో 20 శాతం వరకు వర్షపాతం లోటు ఉంటే దానిని సాధారణంగానే పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఏకంగా 65 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పటికీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల తెలంగాణకు దాని ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా జులై 22 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం చాలా తక్కువగా ఉంది.
ప్రస్తుతం సముద్ర మట్టంలో రుతుపవన ద్రోణి జమ్మూ, డెహ్రాడూన్, బారాబంకి, పాట్నా, బంకురా, కానింగ్ మీదుగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. అయితే ఈ ద్రోణి ప్రస్తుత స్థానం తెలంగాణలో విస్తారంగా రుతుపవనాల విస్తరణకు ఏమాత్రం అనుకూలంగా లేదని ఐఎండీ స్పష్టం చేసింది. దీని కారణంగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా కేవలం తేలికపాటి జల్లులు లేదా చిరుజల్లులు మాత్రమే పడే అవకాశం ఉంది. ఇది పెద్దగా ఉపశమనం కలిగించకపోవచ్చు.
వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాడు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 38.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల రెండు రోజుల్లో తెలంగాణలోని తూర్పు, ఆగ్నేయ జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. జులై మాసం అత్యంత కీలకమైన సాగు సమయం కావడం, ఈ సమయంలో వర్షాలు మొహం చాటేయడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పొడి వాతావరణం, తీవ్రమైన ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
{{/usCountry}}రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. జులై మాసం అత్యంత కీలకమైన సాగు సమయం కావడం, ఈ సమయంలో వర్షాలు మొహం చాటేయడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పొడి వాతావరణం, తీవ్రమైన ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
{{/usCountry}}