హాంకాంగ్కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ముడిపడి ఉన్న నాలుగు భారీ మోసాల కేసులకు సంబంధించి.. హైదరాబాద్ పోలీసులు 32 మందిని అరెస్టు చేశారు. ఈ క్యూనెట్ కేసులో భాగంగా భారీగా మోసం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు వ్యాప్తంగా సైబర్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ అరెస్టులు చేసింది.

విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, గోల్డ్ క్వెస్ట్, క్యూనెట్ అని కూడా పిలిచే క్యూఐ గ్రూప్ యాజమాన్యంలో ఉందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సమావేశంలో తెలిపారు. ఆ కంపెనీ పైకి తనను తాను ఒక ఉత్పత్తి ఆధారిత వ్యాపారంగా ప్రదర్శించుకుంటున్నప్పటికీ, తెరవెనుక అక్రమ డబ్బు చలామణి పథకాన్ని నడుపుతోందని ఆరోపణలు ఉన్నాయి.
ఉపాధి కోరుకునే యువతతో పాటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, గృహిణులను లక్ష్యంగా చేసుకుంటారు. అధిక రాబడి ఇస్తామని ఆశ చూపి, మోసం చేస్తారు. నమ్మకం సంపాదించిన తర్వాత.. బాధితులను హైటెక్ సిటీలోని వివిధ హోటళ్లకు ఆహ్వానించి, అక్కడ నిందితులు కంపెనీ పేరు వెల్లడించకుండా ఒక పెట్టుబడి పథకాన్ని వివరిస్తారు. రెండేళ్లలో రూ. 3 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు రాబడి వస్తుందని చెబుతారు. రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టేలా ఒప్పిస్తారు.
ఈ ఫ్రాడ్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు మోసగాళ్లు. దీనిలో ప్రతి సభ్యుడు మరో ఇద్దరిని చేర్చుకోవడం ద్వారా ఒక చైన్ సిస్టమ్ ఏర్పరుస్తారని సజ్జనార్ వివరించారు. చేర్చుకునే వారిని అప్లైనర్లు అని, వారు చేర్చుకున్న వారిని డౌన్లైనర్లు అని పిలుస్తారు. అంతేకాకుండా వ్యక్తులు ఇప్పటికే ఉన్న సభ్యుని ద్వారా మాత్రమే ఈ పథకంలో చేర్చేలా ప్లానింగ్ ఉంటుంది. అందువల్ల ఇందులో జాయిన్ చేయడం అనేది మెయిన్ తీసుకుంటారు మోసగాళ్లు. తెలివిగా బురిడీ కొట్టింటి జాయిన్ చేయిస్తారు.
'అధిక కమీషన్ల హామీలతో సభ్యులను చేర్చుకోవడం అనేది ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం, 1978లోని నిబంధనల పరిధిలోకి వస్తుంది. ఇప్పటివరకు 11 మంది మహిళలతో సహా 32 మందిని అరెస్టు చేశాం. వీరిలో కొందరు మాజీ ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నాలుగు కేసుల్లో దాదాపు రూ. 75 లక్షలు కోల్పోయిన 11 మంది బాధితులను మేం విచారించాం. పరారీలో ఉన్న వారిని అరెస్టు చేసే ప్రక్రియలో కూడా ఉన్నాం.' అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.
{{/usCountry}}'అధిక కమీషన్ల హామీలతో సభ్యులను చేర్చుకోవడం అనేది ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం, 1978లోని నిబంధనల పరిధిలోకి వస్తుంది. ఇప్పటివరకు 11 మంది మహిళలతో సహా 32 మందిని అరెస్టు చేశాం. వీరిలో కొందరు మాజీ ఐటీ ఉద్యోగులు ఉన్నారు. నాలుగు కేసుల్లో దాదాపు రూ. 75 లక్షలు కోల్పోయిన 11 మంది బాధితులను మేం విచారించాం. పరారీలో ఉన్న వారిని అరెస్టు చేసే ప్రక్రియలో కూడా ఉన్నాం.' అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.
{{/usCountry}}