ఫీజు బకాయిలపై తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రభుత్వం… కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు నిర్వహించారు. కాలేజీలతో జరిపిన చర్చలు సఫలం కావటంతో…. రేపట్నుంచి బంద్ విరమిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి.

ప్రైవేట్ కాలేజీల బకాయిలలో ఇప్పటికే 600 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని హామీనిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి, యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలను చర్చిస్తామని వివరించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలను ఈనెల 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. ప్రభుత్వంతో కాలేజీల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కళాశాలలు నవంబర్ 8వ తేదీతో నుంచి తెరుచుకోనున్నాయి.
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు:
విద్య అంటే వ్యాపారం కాదని, విద్య అంటే సేవ అని, చదువుల విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం సహించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడతలవారీగా చెల్లించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పునరుద్ఘటించారు.
విద్యా సంస్థలను మూసివేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఎవరినీ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యను వ్యాపారంగా చూడటం తగదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హితవు పలికారు. విద్యా సంస్థలకు సంబంధించిన అనుమతులు, ఇతర విషయాల్లో చట్టంలోని నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని పేర్కొన్నారు.
{{/usCountry}}విద్యా సంస్థలను మూసివేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఎవరినీ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యను వ్యాపారంగా చూడటం తగదని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హితవు పలికారు. విద్యా సంస్థలకు సంబంధించిన అనుమతులు, ఇతర విషయాల్లో చట్టంలోని నిబంధనల ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుందని పేర్కొన్నారు.
{{/usCountry}}