గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ. 5257 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా వరంగల్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే నగరంలో భారీ వర్షాలు కురిస్తే చాలు… మురుగు నీరు ఏరులై పారుతోంది. దీనికి ప్రధాన కారణం… భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం. బహిరంగ నాలాలు ఉండటంతో… మురుగునీరు ఏరులై పారే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తుండగా… ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది.
మూడు దశలలో నిధులను వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భూగర్భంలో కాలువల వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. అలాగే వర్షపునీటి ప్రవాహం-యాజమాన్య వ్యవస్థ, నీటిసరఫరా, చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటారు. భూగర్భ డ్రైనేజీ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా ముందుకు సాగే అవకాశం ఉంది.
- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 5,257.20 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల (UGD) ప్రాజెక్ట్ - ఫేజ్ 1కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
- ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర నిధులతో చేపడుతున్నారు.
- కేంద్ర ప్రభుత్వం వాటాగా 25 శాతం (రూ.1,314.30), రాష్ట్ర ప్రభుత్వం వాటా 25 శాతం (రూ.1,314.30 కోట్లు) ఉండగా… మిగతా 50 శాతం నిధులను బ్యాంకు రుణం లేదా పీపీపీ పద్ధతిలో సమకూర్చుస్తారు.
- భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులపై కేఎఫ్డబ్ల్యూ ఆసక్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీపీఆర్ను అధ్యయనం చేసింది. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రాథమికంగా అంగీకరించింది.
- ఈ నేపథ్యంలో వరంగల్లో ఫేజ్-1 కింద రూ.5,257.20కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వరంగల్ నగర రూపురేఖలు మారిపోవడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వస్తుంది. సెప్టిక్ ట్యాంకులు , బహిరంగ మురుగు కాలువల అవసరం లేకుండా నేరుగా భూగర్భ పైపుల ద్వారా మురుగునీటి తరలింపు జరుగుతుంది.
{{/usCountry}}ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వరంగల్ నగర రూపురేఖలు మారిపోవడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మెరుగైన పారిశుద్ధ్యం అందుబాటులోకి వస్తుంది. సెప్టిక్ ట్యాంకులు , బహిరంగ మురుగు కాలువల అవసరం లేకుండా నేరుగా భూగర్భ పైపుల ద్వారా మురుగునీటి తరలింపు జరుగుతుంది.
{{/usCountry}}దోమల నివారణ , మురుగునీటి వల్ల వచ్చే వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి. వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరు కాలువల ద్వారా వెళ్లడం వల్ల వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచే సమస్య తప్పుతుంది. వరంగల్ నగరానికి ఐటి కంపెనీలు మరియు ఇతర పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు అనుమతులు రావటంతో… ఓరుగల్లు నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.