రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) కార్యక్రమం కోసం అదనపు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.16.62 కోట్లు మంజూరు చేసింది.

2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను గజ్వేల్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. గజ్వెల్లోని టీపీఎస్ ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు తరగతులతో ప్రారంభమవుతుంది. కాగా 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్నత తరగతులు 2027-28 విద్యా సంవత్సరంలో మొదలవుతాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యా విధానంలో సిఫార్సు చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుండి పూర్తి సదుపాయాలు గల ప్రాంగణాలతో తెలంగాణ పాఠశాలలను(టీపీఎస్) అభివృద్ధి చేయనుంది. సుమారు 1,500 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తూ ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందించాలని ప్రతిపాదిస్తోంది. టీపీఎస్ కార్యక్రమం కోసం రూ.500 కోట్లను బడ్జెట్లో కేటాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణ విద్యా విధానంలో సిఫార్సు చేసిన టీపీఎస్ కార్యక్రమం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రీ-ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందించే పూర్తిస్థాయి సదుపాయాలు గల ప్రాంగణాలుగా మార్చడం ప్రభుత్వ లక్ష్యం.
తెలంగాణలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రేవంత్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణలో టెన్త్ పరీక్షలు తొలగించేందుకు కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఒకే విధానంలో విద్యాబోధన చేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీబీఎస్ఈ మాదిరిగానే ప్లస్ 2 విధానం అమల్లోకి తీసుకురావాలని అనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
విద్యా వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ బోర్డు తొలగించే ఆలోచనలో ఉంది సర్కార్. మరోవైపు రాష్ట్రంలో 100కిపైగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చూడుతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఏకీకృత విధానం అమలులోకి రానుంది. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఒకే పాఠశాల ప్రాంగణంలో విద్యను అందించే విధానం అందుబాటులోకి వస్తుంది. ఇది విద్యార్థులపై భారాన్ని తగ్గించనుందని ప్రభుత్వం అనుకుంటోంది.
{{/usCountry}}విద్యా వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ బోర్డు తొలగించే ఆలోచనలో ఉంది సర్కార్. మరోవైపు రాష్ట్రంలో 100కిపైగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చూడుతోంది. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఏకీకృత విధానం అమలులోకి రానుంది. నర్సరీ నుంచి 12వ తరగతి దాకా ఒకే పాఠశాల ప్రాంగణంలో విద్యను అందించే విధానం అందుబాటులోకి వస్తుంది. ఇది విద్యార్థులపై భారాన్ని తగ్గించనుందని ప్రభుత్వం అనుకుంటోంది.
{{/usCountry}}