టీజీపీఎస్సీలో ఉద్యోగాల కోసం చూసే అభ్యర్థులకు కమిషన్ కీలక విషయం తెలిపింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఓటీఆర్కు సంబంధించి కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తులో కీలకమైన ఓటీఆర్ చేసుకున్న 31.56 లక్షల మంది తమ ఐడీ సాయంతో తాజా వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
భవిష్యత్ నోటిఫికేషన్లకు ఇదే

భవిష్యత్తులో వచ్చే అన్ని నోటిఫికేషన్లు, దరఖాస్తులు, ఫలితాలు, తుది ఎంపికలు అభ్యర్థుల ఇప్పుడు అప్డేట్ చేసే OTR డేటా ఆధారంగా ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. దాని ప్రకారం డేటా వ్యవస్థలో దాదాపు 31.65 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారంతా.. ఇప్పుడు అప్డేట్ చేయాలి.
ఈ కారణాలతో అప్డేట్
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, అభ్యర్థుల విద్యా అర్హతలలో మార్పుల కారణంగా ఇప్పుడు ఓటీఆర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తాజా వివరాల తప్పనిసరిగా నమోదు చేయాలని కమిషన్ పేర్కొంది. 'నియామక ప్రక్రియలను వేగంగా పూర్తి చేయడం, ఫలితాల ముందస్తు ప్రకటన, నియామక ఉత్తర్వులను సకాలంలో జారీ చేయడం, డేటా వ్యత్యాసాలు, అసంపూర్ణ డాక్యుమెంటేషన్ కారణంగా కలిగే జాప్యాలను నివారించడానికి కమిషన్ ప్రయత్నాలలో ఇది భాగం.' అని టీజీపీఎస్సీ పేర్కొంది.
ఇవి అప్డేట్ చేయాలి
ఓటీఆర్ని అప్డేట్ చేసే ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిగత, విద్యా, కేటగిరీ వివరాల ధృవీకరణ, కచ్చితత్వం, అన్ని అర్హతలు, అదనపు అర్హతలు, తాజా కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్తో సహా అన్ని సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం వంటివి చేయాలి. ఓటీఆర్లో అదనపు అర్హతలు, చిరునామా, ఈడబ్ల్యూఎస్, నాన్క్రీమీలేయర్ కేటగిరీలు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ మినహా ఇతర వివరాలను అప్డేట్ చేసేందుకు వీల్లేదు. ఈ తప్పనిసరి అప్డేట్ను పూర్తి చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 2గా ఉండేది. అయితే ఇప్పుడు దానిని ఫిబ్రవరి 25 వరకు పొడిగించారు.
సరైన వివరాలు ఇవ్వాలి
రూల్ ప్రకారం.. ప్రతి అభ్యర్థికి ఒకే ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఇది ఏ కారణం చేతనైనా అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుతుంది. అభ్యర్థి అదనపు అర్హతలు, కరస్పాండెన్స్ చిరునామా, కమ్యూనికేషన్లో మార్పులు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, కేటగిరీకి సంబంధించిన వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా అతని/ఆమె డేటాను యాడ్ చేయవచ్చు, మెరుగుపరచవచ్చు అని కూడా కమిషన్ తెలిపింది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్నా.. ఆధారాలు సమర్పించలేదు. ఇప్పుడు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఇదే ఫైనల్
{{/usCountry}}రూల్ ప్రకారం.. ప్రతి అభ్యర్థికి ఒకే ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఇది ఏ కారణం చేతనైనా అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుతుంది. అభ్యర్థి అదనపు అర్హతలు, కరస్పాండెన్స్ చిరునామా, కమ్యూనికేషన్లో మార్పులు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, కేటగిరీకి సంబంధించిన వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా అతని/ఆమె డేటాను యాడ్ చేయవచ్చు, మెరుగుపరచవచ్చు అని కూడా కమిషన్ తెలిపింది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్నా.. ఆధారాలు సమర్పించలేదు. ఇప్పుడు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఇదే ఫైనల్
{{/usCountry}}అభ్యర్థులు డేటాను అప్లోడ్ చేసేటప్పుడు, సవరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓటీఆర్ పోర్టల్లో అప్డేట్ చేసిన సమాచారమే తుది డేటాగా పరిగణిస్తారు. భవిష్యత్ నోటిఫికేషన్ల కోసం పరిశీలిస్తారు. దీనిద్వారానే భవిష్యత్తులో ఏదైనా నియామక ప్రకటనకు అర్హులు అవుతారా లేదా అనేది నిర్ణయిస్తారు.
ఫిబ్రవరి 25లోపు అప్డేచ్ చేయాలి. మరిన్ని వివరాలు కమిషన్ వెబ్సైట్లో (https://www.tgpsc.gov.in/) అందుబాటులో ఉన్నాయి.