దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లితో పాటు ఉండవల్లిలో అధికారులు నిర్వహించిన సోదాల్లో… భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. శాంతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు… రాత్రి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు.
భారీగా అక్రమాస్తులు..!

శాంతి నివాసాల్లో జరిపిన తనిఖీల్లో భారీగానే ఆస్తులు బయటపడ్డాయి. సుమారు 50 కోట్లకు పైగా విలువైన స్థిరాస్తుల పత్రాలు, భారీగా బంగారం, భారీగా నగదు లభించినట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం, బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ప్రాథమిక విచారణలో గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం… విశాఖపట్నంలో ఒక ఫ్లాట్, కుంచనపల్లిలో G+2 భవనం ఉంది. 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి లభ్యమైంది. ఒక వోక్స్వ్యాగన్ పోలో కారు, ఒక మోటార్ సైకిల్ ఉంది.ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పాటు ఇతర విలువైన వస్తువులను గుర్తించారు. సోదాల్లో శాంతి పేరిట విజయవాడ వన్టౌన్లోని యూనియన్ బ్యాంకులో లాకర్ ఉన్నట్లు గుర్తించారు. కోర్టు అనుమతితో లాకర్ తెరవనున్నారు.
2020లో ఏపీపీఎస్సీ ద్వారా శాంతి ఉద్యోగానికి ఎంపికయ్యారు. గతంలో విశాఖపట్నం, విజయవాడలో విధులు నిర్వహించారు. జూలై 2024 నుండి మార్చి 2026 వరకు సస్పెన్షన్లో ఉండగా… ఇటీవలనే సస్పెన్షన్ ఎత్తివేశారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం వేచి చూస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో శాంతి అత్యంత కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవటంతో పలు కారణాలతో ఆమెపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు కూడా వేసింది.
అక్రమాస్తుల కేసులో శాంతిని అరెస్ట్ చేయగా… ఆమె హయాంలో జరిగిన భూ కేటాయింపులు, టెండర్ల ప్రక్రియ , ఇతర ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏసీబీ పూర్తిస్థాయి విచారణ తర్వాత… అధికారికంగా మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.
{{/usCountry}}అక్రమాస్తుల కేసులో శాంతిని అరెస్ట్ చేయగా… ఆమె హయాంలో జరిగిన భూ కేటాయింపులు, టెండర్ల ప్రక్రియ , ఇతర ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఏసీబీ పూర్తిస్థాయి విచారణ తర్వాత… అధికారికంగా మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.
{{/usCountry}}