ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (AP SET) 2025 నోటిఫికేషన్ను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలతో పాటు విశ్వవిద్యాలయాలలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవులకు అభ్యర్థుల అర్హతను ఏపీ సెట్ నిర్ణయిస్తుంది.

ఏపీ సెట్.. 2026 మార్చి 28, 29 తేదీలలో పరీక్ష జరగనున్నాయి. AP SET పరీక్షకు జనవరి 9న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 9, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.
AP SET 2025కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. జనరల్, ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), వికలాంగులు (PwD), ట్రాన్స్ జెండర్స్ వర్గాలకు చెందిన వారు కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంది.
ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి: పేపర్ 1, జనరల్ స్టడీస్ (టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్)పై ఫోకస్ చేస్తుంది. ఇది అన్ని అభ్యర్థులకు తప్పనిసరి. పేపర్ 2 మొత్తం 30 నిర్దిష్ట సబ్జెక్టులను కవర్ చేస్తుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండటం చాలా అవసరం.
పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు మార్చి 19 నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా అర్హత సాధించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం AP SET నిర్వహిస్తుంది.
{{/usCountry}}పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు మార్చి 19 నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా అర్హత సాధించడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం AP SET నిర్వహిస్తుంది.
{{/usCountry}}ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు: www.apset.net.in లేదా www.andhrauniversity.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియను ఫిబ్రవరి 9, 2026 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా పూర్తి చేయవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు రూ.2,000 ఆలస్య రుసుముతో, మార్చి 5 వరకు రూ.5,000 అధిక ఆలస్య రుసుముతో దరఖాస్తులను సమర్పించవచ్చు.