ఏపీ పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 20వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. ఈ ఎగ్జామ్ ను మార్చి 21వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్ ఒకటితో ముగుస్తాయి. అయితే మార్చి 20వ తేదీన జరగబోయే ఇంగ్లీష్… మార్చి 21వ తేదీకి మారినప్పటికీ… మిగతా పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం మార్చి 20న రంజాన్ పండగ ఉండటంతో ఈ మార్పు చేసేందుకు విద్యాశాఖ… ప్రతిపాదనలు పంపింది. ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఈ ఒక్క తేదీ మారింది. మిగతా పరీక్షలు యథావిథిగా జరుగుతాయి. ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తారు.
ఏపీ టెన్త్ పరీక్షలు - కొత్త షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్(ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20)
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు