AP Telangana Weather Report : ఏపీ, తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో…. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కొన్నిచోట్ల వడగాలులు కూడా వీస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఏపీలో మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బుధవారం రాయలసీమ,కోస్తా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం4,విజయనగరం19,మన్యం 14, అల్లూరి1, పోలవరం 4, అనకాపల్లి 2, కాకినాడ 1,తూర్పుగోదావరి 1 మండలాల్లో(46) తీవ్రవడగాలులు, మరో 73 మండలాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయి. ఎండ
కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామలలో 44. 2 డిగ్రీలు, తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
తెలంగాణలో మండుతున్న ఎండలు…
మరోవైపు తెలంగాణలోనూ కూడా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.
మంగళవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే ఐద్రోజుల్లో మరో 2 నుంచి 3 డిగ్రీలు దాటే అవకాశముంది. మంగళవారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో 43.3, ఆదిలాబాద్లో 43.2, సిద్దిపేటలో 42.9, కామారెడ్డిలో 42.8, కరీంనగర్లో 42.8, మంచిర్యాల 42.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో బయటకు రాకపోవడం మంచిదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టోపీ ధరించడం లేదా గొడుగు లాంటివి వాడటం చేయాలని చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో మంచి నీళ్లను తీసుకోవటమే కాకుండా కొబ్బరి నీళ్ల వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. అనవసరమైన ప్రయాణాలు చేయకపోవటం మంచిదని… ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.
{{/usCountry}}ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో బయటకు రాకపోవడం మంచిదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టోపీ ధరించడం లేదా గొడుగు లాంటివి వాడటం చేయాలని చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో మంచి నీళ్లను తీసుకోవటమే కాకుండా కొబ్బరి నీళ్ల వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. అనవసరమైన ప్రయాణాలు చేయకపోవటం మంచిదని… ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.
{{/usCountry}}