మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే వారి మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉండగా… డీఎన్ఏ పరీక్షలతో గుర్తించారు.

మార్కాపురం జీజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోయారు. గురువారం రాత్రి తోబుట్టువుల (మొత్తం 22 మంది) నుంచి గుంటూరు రీజినల్ పోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎస్ఎస్ఎల్) నిపుణులు రక్త నమూనాలు సేకరించారు.తోబుట్టువుల నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్ లో పరీక్షించారు. శుక్రవారం రాత్రి వరకు ఈ వెలువడ్డాయి. వీటి ఆధారంగా మృతదేహాల గుర్తింపు కార్డులోని వివరాలతో అనుసంధానం చేశారు.
శనివారం ఉదయం నుంచి తోబుట్టవులకు మృతదేహాలను అప్పగిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసే అంబులెన్సుల ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను ఎస్కార్ట్ సాయంతో పంపనున్నారు.కందుకూరు. కనిగిరి, ఒంగోలు, నెల్లూరు జిల్లా బుచ్చి వరకు మృతదేహాల తరలింపు జరగనుంది.
తగిన జాగ్రత్తలతో..!
డీఎన్ఏ పరీక్షల నిర్వహణలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చనిపోయిన వారి తోబుట్టవుల (రక్త సంబంధీకులు) నుంచి నమూనాలు సేకరించారు. ఒక కేసు విషయంలో తండ్రి, బిడ్డ చనిపోయారు. తండ్రిని ఆయన తల్లిదండ్రుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, బిడ్డ విషయంలో తల్లి నుంచి సేకరించిన నమూనాను పరీక్షించడం ద్వారా వారి మృతదేహాల గుర్తింపు సాధ్యమైంది.
బస్సు ప్రమాదంలో గాయపడిన 20 మంది… ఒంగోలు, మార్కాపురం అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో 16 మంది, మార్కాపురం జీజీహెచ్లో 12 మంది, ప్రైవేటు ఆసుపత్రిలో ఒకరు చొప్పున చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
ఒంగోలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి కాళ్లకు శుక్రవారం శస్త్ర చికిత్స చేశారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ వెల్లడించారు. వైద్యుల వైద్యుల సూచనలు అనుసరించి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. చికిత్స, ఆరోగ్య పరిస్థితులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.