తిరుమల కల్తీ నెయ్యి కేసు విషయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిటీ టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన లోటుపాట్లతో పాటు సిట్ నివేదికను అధ్యయం చేయనుంది.తదుపరి చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.
మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసుపై ఈడీ కూడా ఫోకస్ పెట్టింది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారడంపై ఈడీ విచారణ చేయనుంది. మనీ ట్రయల్పైనా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు.
సీబీఐ నేతృత్వంలోని సిట్ దర్యాప్తులో ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి వివిధ డెయిరీల డైరెక్టర్లు, టీటీడీ అధికారుల మధ్య నేరపూరిత కుట్ర జరిగిందని సిట్ ఆరోపించింది. అనర్హమైన డెయిరీలు నకిలీ పత్రాలను సమర్పించి, తక్కువ ధరలను కోట్ చేయడం ద్వారా టెండర్లను పొందాయని ఆరోపణలు ఉన్నాయి.
సిట్ విచారణ ప్రకారం.. ప్రధానంగా భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి చెందిన పోమిల్ జైన్(A-3), విపిన్ జైన్ (A-4) లంచాలు చెల్లించారు. కమిషన్ ఏజెంట్ల ద్వారా నిధులు మళ్లించారు. ఢిల్లీ హవాలా దుకాణాల నుండి విజయవాడ (భరత్ భాయ్ ఠాకూర్), చెన్నై (మదారం దేవాసి), హైదరాబాద్ (అర్జున్ గోస్వామి) ఏజెంట్లకు టోకెన్ ఆధారిత కరెన్సీ వెరిఫికేషన్ సిస్టమ్ను ఉపయోగించి నిధులను తరలించే హవాలా నెట్వర్క్ ఉన్నాయని ఛార్జిషీట్ పేర్కొంది.
నెయ్యి కల్తీ వ్యవహారంలో ఛార్జ్షీట్లో 36 మందిని నిందితులుగా చేర్చింది సిట్. అందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. టెండర్లలో అక్రమాలు, హవాలా మార్గాల ద్వారా లంచాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా విచారణలో తేలింది. దీంతో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణ చేయనుంది. త్వరలోనే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}నెయ్యి కల్తీ వ్యవహారంలో ఛార్జ్షీట్లో 36 మందిని నిందితులుగా చేర్చింది సిట్. అందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. టెండర్లలో అక్రమాలు, హవాలా మార్గాల ద్వారా లంచాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా విచారణలో తేలింది. దీంతో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణ చేయనుంది. త్వరలోనే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
{{/usCountry}}