డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాల భద్రత ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీ అండ్ ఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి టీటీడీ, పోలీసు ఉన్నతాధికారులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వైకుంఠ ద్వార దర్శనాల భద్రతా ఏర్పాట్లపై మూడు గంటల పాటు క్షేత్రస్థాయిలో చర్చించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుంది. టోకెన్ లేని భక్తులకు జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా నేరుగా సర్వ దర్శనాలకు రావచ్చని భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు.
తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతాల్లో భక్తులకు తెలిసే విధంగా రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్, సోషల్ మీడియా, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా భక్తులకు అవగాహన కల్పించేందుకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో సూచించారు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని విభాగాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని భక్తులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి. వైకుంఠ ఏకాదశి ముందురోజు సాయంత్రం నుండి భక్తులకు అన్న పానీయాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్న ప్రసాద విభాగం అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించేందుకు అవసరమైన సంఖ్యలో శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో ఎలాంటి అయోమయం తలెత్తకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ, పోలీసు అధికారులతో వాట్సాప్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమస్యలపై తక్షణం స్పందించేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
{{/usCountry}}తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో ఎలాంటి అయోమయం తలెత్తకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ, పోలీసు అధికారులతో వాట్సాప్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమస్యలపై తక్షణం స్పందించేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు.
{{/usCountry}}