తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత శ్రీవారి ఆలయంలో ఏకాంత పూజలు చేస్తారు. ఆ తర్వాత అంటే మంగళవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఈ-డిప్లో టోకెన్లు కలిగిన భక్తులనే అనుమతిస్తారు.
వైకుంఠ ద్వార దర్శనాలు - ముఖ్యమైన విషయాలు:
- శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలను కూడా ప్రకటించింది.
- వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో SED, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయబడవు.
- వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది. జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు.
- భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవు.
- వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు.
- డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
- జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు.
- వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
- రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు రోజుకు 125 మందికి దర్శనం కల్పించనున్నారు. రూ.లక్ష నుండి రూ.99 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి దర్శనం ఉంటుంది.
- జనవరి 1వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 2వేల మందికి దర్శనం కల్పించనున్నారు. వీరు కూడా ఆన్ లైన్ అప్లికేషన్ లో డిసెంబర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

{{^htLoading}} {{/htLoading}}