ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు బృందం.. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అనుసరించిన అక్రమ పద్ధతులపై పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా, మార్కాపురం నుండి విజయవాడ వరకు సాగిన సాయికృష్ణ తరలింపు ఎపిసోడ్పై పోలీసులు ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టి సారించారు.

నమ్మలేని నిజాలు ఈ విచారణలో బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్ఫోర్స్ సబ్-ఇన్స్పెక్టర్ నవీన్తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్లినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ఈ బృందం.. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఎక్కడా నమోదు చేయకుండా, ఒక ప్రైవేట్ వాహనంలో విజయవాడకు తరలించినట్లు సాంకేతిక, క్షేత్రస్థాయి ఆధారాలతో సహా నిర్ధారించారు.
ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే టాస్క్ఫోర్స్ ఏడీసీపీ (ADCP) లతాకుమారి, ఎస్ఐ నవీన్లతో పాటు పలువురు కానిస్టేబుళ్లను విచారణకు పిలిపించారు. ఈ వ్యవహారంలో వారి పాత్రపై సుదీర్ఘంగా ప్రశ్నించి, స్టేట్మెంట్లను రికార్డు చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 24 గంటలకు పైగా నిందితులను, అనుమానితులను విచారించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ విచారణలో ట్రాన్సపోర్టేషన్, మొబైల్ సిగ్నల్స్ వంటి డిజిటల్ ఆధారాలను సేకరించిన పోలీసులు ఒకే ఒక్క ప్రధాన ప్రశ్నపై దృష్టి పెట్టారు. అసలు విజయవాడ పరిధి దాటి అంత దూరం మార్కాపురానికి వెళ్లమని టాస్క్ఫోర్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఇటువంటి ఒత్తిడులు ఏవైనా ఉన్నాయా, లేదా కస్టడీలో ఏదైనా జరిగిందా అనే కోణాన్ని నిరూపించేందుకు లభించిన క్లూస్ టీమ్ నివేదికల ఆధారంగా ఏసీపీ దైవప్రసాద్ బృందం కేసును లోతుగా తవ్వుతోంది. త్వరలోనే ఈ కేసులో మరికొంత మంది పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
{{/usCountry}}సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఇటువంటి ఒత్తిడులు ఏవైనా ఉన్నాయా, లేదా కస్టడీలో ఏదైనా జరిగిందా అనే కోణాన్ని నిరూపించేందుకు లభించిన క్లూస్ టీమ్ నివేదికల ఆధారంగా ఏసీపీ దైవప్రసాద్ బృందం కేసును లోతుగా తవ్వుతోంది. త్వరలోనే ఈ కేసులో మరికొంత మంది పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
{{/usCountry}}ఈ కేసు విషయంలో గతంలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి సింగ్ నగర్లోని అతని ఇంటిని పోలీసులు దిగ్బంధించారు. దీంతో దర్యాప్తు కీలక దశకు చేరుకుందని స్పష్టమవుతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలువురి వాంగ్మూలాలను నమోదు చేసి, ముఖ్యమైన ఆధారాలను సేకరించి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. విచారణ అనంతరం నాగరాజును అరెస్టు చేసే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.
మే 9న సాయి కృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడు. అనంతరం అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 29 లోగా సాయి కృష్ణను హాజరుపరచాలని కోర్టు ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులను ఆదేశించింది.
తీవ్రమైన కస్టడీ హింస కారణంగా సాయి కృష్ణ మరణించాడని, సాక్ష్యాలను నాశనం చేయడానికి పోలీసులు అతని మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారని అతని కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేసింది.