ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. శనివారం సాయంత్రం వైద్యులు ఆయనకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.
అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్…

శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారులతో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకున్నారు. పరిస్థితిని గమనించిన వైద్యులు… ఆ రోజు జరగాల్సిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించారు.
ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్కు వైద్యులు వివిధ రకాల పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. (MRI) స్కాన్ కూడా నిర్వహించారు. పరీక్షా ఫలితాలను విశ్లేషించిన నిపుణులు, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
10 రోజులు విశ్రాంతి….
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. శస్త్రచికిత్స తర్వాత ఆయన కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాతే ఆయన మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయిత…, ఆయన పూర్తిస్థాయిలో స్వస్థత చేకూరడానికి మరికొంత కాలం పడుతుందని, దీర్ఘకాలం పాటు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు.
“వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని….. పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు” అని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ అధకారిక ప్రకటన విడుదల చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…. అస్వస్థతకు గురై ఆపరేషన్ చేయించుకున్నారన్న వార్త తెలియడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులతో పాటు టాలీవుడ్ హీరోలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
{{/usCountry}}డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…. అస్వస్థతకు గురై ఆపరేషన్ చేయించుకున్నారన్న వార్త తెలియడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులతో పాటు టాలీవుడ్ హీరోలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
{{/usCountry}}