OTT: పాపులర్ తమిళ డైరెక్టర్ కమ్ నటుడు సెల్వరాఘవన్ లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ సినిమా ‘మణిదన్ దైవమంగళం’. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ ప్రకటించేశారు.
మణిదన్ దైవమంగళం ఓటీటీ

తమిళంలో ఇటీవల వచ్చిన రూరల్ డ్రామా ఫిల్మ్ ‘మణిదన్ దైవమంగళం’. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం సన్ నెక్ట్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. మే 1 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం తమిళంలోనే రిలీజ్ అవుతుంది.
9 రేటింగ్
మణిదన్ దైవమంగళం సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9 రేటింగ్ ఉండటం విశేషం. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, ఖుషీ రవి, ఆర్ఎస్ సతీష్, మైమ్ గోపీ, వైజీ మహేంద్రన్, లిర్థిక, సేలం దీపక్, ఎలా భరత్ తదితరులు నటించారు. మణిదన్ దైవమంగళం మూవీకి డెనిస్ మంజునాథ్ డైరెక్టర్. ఏప్రిల్ 10, 2026న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది.
మణిదన్ దైవమంగళం స్టోరీ
మణిదన్ దైవమంగళం సినిమా ఓ గ్రామీణ నేపథ్యలో తెరకెక్కిన చిత్రం. స్థానిక ఎంఎల్ఏను ప్రశ్నించినందుకు ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది సినిమాలో చూపించారు.
అది తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం. అక్కడ రాఘవన్ (సెల్వరాఘవన్) అనే వ్యక్తి ఉంటాడు. అతను తనకంటే వయసులో చాలా చిన్నదైన సెల్వి (ఖుషీ రవి)ని పెళ్లి చేసుకుంటాడు. ఈ జంట ఆనందంగానే ఉంటారు.
అప్పు తీసుకొని
{{/usCountry}}అది తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం. అక్కడ రాఘవన్ (సెల్వరాఘవన్) అనే వ్యక్తి ఉంటాడు. అతను తనకంటే వయసులో చాలా చిన్నదైన సెల్వి (ఖుషీ రవి)ని పెళ్లి చేసుకుంటాడు. ఈ జంట ఆనందంగానే ఉంటారు.
అప్పు తీసుకొని
{{/usCountry}}రాఘవన్ గ్రామంలో కనీసం రోడ్డు సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండవు. రాఘవన్ బంధువు ఒకామె స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు, వడ్డీ వ్యాపారీ అయిన ఇన్బరాజ్ (మైమ్ గోపీ) నుంచి అప్పు తీసుకుంటుంది. ఆ డబ్బుతో రాఘవన్, సెల్వి కలిసి హైవే పక్కన దాబా ఏర్పాటు చేస్తారు. అంతా సాఫీగా సాగుతుందనుకుని సమయంలో కథ అడ్డం తిరుగుతుంది.
ఊర్లో సమస్యల కోసం ఎమ్మెల్యేకు రాఘవన్ వినతిపత్రం ఇస్తాడు. ఆ క్రమంలో ఇన్బరాజ్ పరువు పోతుంది. దీంతో రాఘవన్ పై అతను పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రాఘవన్ కుటుంబం ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకుంది? అనేది మణిదన్ దైవమంగళం సినిమాలో చూడాల్సిందే.