...
...
Next Story

Peddi Trailer: పెద్ది ట్రైలర్.. 24 గంటల్లోనే 10 కోట్లకుపైగా వ్యూస్.. రామ్ చరణ్ రికార్డుల ఊచకోత

Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్‌లోనే ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది.

Published on: May 19, 2026 07:17 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' రిలీజ్ కాకముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. మే 18న ముంబైలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సరికొత్త సంచలనాలకు తెరతీసింది.

Peddi Trailer: పెద్ది ట్రైలర్.. 24 గంటల్లోనే 10 కోట్లకుపైగా వ్యూస్.. రామ్ చరణ్ రికార్డుల ఊచకోత
Peddi Trailer: పెద్ది ట్రైలర్.. 24 గంటల్లోనే 10 కోట్లకుపైగా వ్యూస్.. రామ్ చరణ్ రికార్డుల ఊచకోత

కేవలం 24 గంటల వ్యవధిలోనే 100 మిలియన్లకు (10 కోట్లు) పైగా వ్యూస్ రాబట్టి, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే లాంచ్ రోజున అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించింది. రామ్ చరణ్ రగ్గడ్ లుక్, క్యారెక్టరైజేషన్ చూసి మెగా ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతున్నారు.

సరికొత్త రికార్డుల రారాజు

ట్రైలర్ విడుదలైన నిమిషాల నుంచే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 'పెద్ది' రచ్చతో అట్టుడికిపోయాయి. రామ్ చరణ్ పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గతంలో ఏ తెలుగు సినిమా ట్రైలర్‌కు రానంత రెస్పాన్స్ 24 గంటల్లోనే రావడం ఈ సినిమాపై ఉన్న అంచనాలకు అద్దం పడుతోంది.

కేవలం వ్యూస్ మాత్రమే కాకుండా, లైక్స్ పరంగా కూడా ఈ ట్రైలర్ సరికొత్త రికార్డులను సృష్టించింది. రానున్న రోజుల్లో రాబోయే స్పెషల్ సాంగ్స్, భారీ ప్రమోషనల్ ఈవెంట్లతో ఈ క్రేజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

కథలో ఎమోషనల్ డెప్త్.. చరణ్ గాయాలు

ఈ సినిమాలో రామ్ చరణ్ 'పెద్ది పెహల్వాన్' అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఊరిలో విడిపోయిన జనాలను క్రీడల ద్వారా ఎలా ఒకటి చేయాలనే తపనతో సాగే ఒక భావోద్వేగ ప్రయాణమే ఈ చిత్రం. ముంబై ట్రైలర్ లాంచ్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాము ఎంతగా కష్టపడ్డామో వివరించారు.

"ఈ సినిమా మా అందరి రక్తంలో ప్రవహిస్తోంది. గత రెండేళ్లుగా మేము 'పెద్ది' ప్రపంచంలోనే బతుకుతున్నాం. బుచ్చిబాబు ఈ కథను ఐదేళ్లుగా శ్వాసిస్తున్నాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకువచ్చినందుకు దర్శకుడికి థాంక్స్," అని రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు.

చిరంజీవి ప్రశంసలు.. ఒక దశాబ్దపు చిత్రం

ఈ సినిమాలోని కొన్ని భాగాలను చూసిన మెగాస్టార్ చిరంజీవి కళ్లవెంట నీళ్లు పెట్టుకున్నారని చరణ్ వెల్లడించారు.

"ఇలాంటి అద్భుతమైన కథలు ఏ నటుడికైనా దశాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తాయి. ప్రతి ఏటా 'మగధీర' లేదా 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి సినిమాలు రావు. ఈ జర్నీని పూర్తిగా ఆస్వాదించు" అని చిరంజీవి తనకు సలహా ఇచ్చినట్లు చరణ్ చెప్పారు.

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో 'అచ్చియమ్మ'గా చరణ్ సరసన నటిస్తోంది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, దివ్యేందు, జగపతి బాబు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'పెద్ది' ట్రైలర్ 24 గంటల్లో ఎన్ని వ్యూస్ సాధించింది?

ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 100 మిలియన్లకు (10 కోట్లు) పైగా వ్యూస్ సాధించి, టాలీవుడ్‌లోనే అత్యధిక వ్యూస్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది.

2. 'పెద్ది' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4, 2026న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, ఆమె పాత్ర పేరేంటి?

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో 'అచ్చియమ్మ' అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది.

4. 'పెద్ది' సినిమాకు సంగీతం అందిస్తున్నది ఎవరు?

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe