పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులపై రగిలిపోతున్న ఇరాన్…. ప్రతిదాడులకు దిగుతోంది. అమెరికాను కూడా టార్గెట్ చేస్తూ… దాడులకు చేపట్టింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున రెండు డ్రోన్లతో దాడికి పాల్పడింది.

డ్రోన్ల దాడి దాటికి రాయబార కార్యాలయం పరిసరాల్లో భారీ శబ్దం వినిపించటమే కాకుండా మంటలు కూడా చెలరేగాయి. ఈ విషయాన్ని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ కూడా ధ్రువీకరించింది.
రియాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై రెండు డ్రోన్లు దాడి చేయడంతో చిన్న మంటలు చెలరేగాయని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. భవనానికి స్వల్ప నష్టం జరిగినట్లు వెల్లడించారు.
రాయబార కార్యాలయం చుట్టూ అగ్నిమాపక యంత్రాలను చూశామని ఇద్దరు సాక్షులు AFP కి చెప్పారు.ఇదే భవనంపై పొగను కూడా చూశామని పేర్కొన్నారు. రియాద్లోని దౌత్య కార్యాలయాలు ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది.
మరోవైపు ఇరాన్.. గల్ఫ్ అంతటా ప్రతీకార దాడులతో ముందుకు సాగుతోంది. సోమవారం కువైట్ నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి పొగ వెలువడింది. ఈ విషయాన్ని ఓ దౌత్యధికారి ధ్రువీకరించారు.
ట్రంప్ వార్నింగ్…!
అమెరికా రాయబార కార్యాలయాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ కు గట్టి బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.ఈసారి మరింత భీకర దాడులు చేస్తామని, మాపై దాడులు చేసిన వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు.
ఇక ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా, హౌతీ వంటి మిలిటెంట్ సంస్థలు రంగంలోకి దిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ దీటుగా స్పందించింది. రాజధాని బీరూట్ దక్షిణ శివారు, దక్షిణ లెబనాన్లపై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై ఇతర దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
{{/usCountry}}ఇక ఇరాన్కు మద్దతుగా హెజ్బుల్లా, హౌతీ వంటి మిలిటెంట్ సంస్థలు రంగంలోకి దిగాయి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలు, ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై హెజ్బొల్లా రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ దీటుగా స్పందించింది. రాజధాని బీరూట్ దక్షిణ శివారు, దక్షిణ లెబనాన్లపై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై ఇతర దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
{{/usCountry}}