...
...
Next Story

US - Iran War : అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత - మీడియాలో కథనాలు..!

అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన పలు మీడియా సంస్థలు ధ్రువీకరించాయి.

Published on: Apr 03, 2026 08:45 PM IST
Advertisement

ఇరాన్ - అమెరికా యుద్ధ పరిస్థితులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజాగా ఎఫ్ - 15 యుద్ధ విమానాన్ని కూల్చేశామని… ఇద్దరు అమెరికన్‌ పైలెట్‌లు మిస్ అయ్యారని ఇరాన్ ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. ఆ పైలెట్ల కోసం అమెరికా వెతికే ప్రయత్నాలు ప్రారంభించిందని కూడా పేర్కొంది.

అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత (representative image) (HT image)
అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత (representative image) (HT image)

ఇరాన్ ప్రకటన ప్రకారం… వారి సైన్యం చేతిలో కూలిన ఫైటర్ జెట్ల సంఖ్య రెండుకు చేరినట్లు అవుతుంది. ఈ ఘటనలో పైలట్ గాయపడ్డాడని, బతికిఉండే అవకాశాలు తక్కువని పేర్కొంది. ఒకవేళ వాళ్లు ప్రాణాలతో ఉంటే… ప్రభుత్వానికి అప్పగించాలని కూడా ప్రకటనలు జారీ అయ్యాయి.

ఇరాన్‌ ప్రకటనపై యూఎస్ సెంట్రల్ కమాండ్‌ (సెంట్‌కామ్‌) నుంచి ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. కానీ అమెరికా మీడియా సంస్థలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మిస్ అయిన పైలెట్ల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నీల్ తో పాటు ఆక్సియోస్ అమెరికా వార్త సంస్థలు నివేదించాయి.

F-15ఫైటర్ జెట్ కూల్చివేతపై ఇరాన్ ప్రకటన నిజమేనా..? లేదా అనే విషయంపై వైట్ హౌస్ వర్గాల నుంచి అధికారికంగా ధ్రువీకరణ కావాల్సి ఉంది. విమానాన్ని కూల్చివేయడంపై యూఎస్ సెంట్రల్ కమాండ్, పెంటగాన్ నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.

ఈ ఘటనలో కూలిపోయింది ఎఫ్‌-15 యుద్ధ విమానమేనా అనే విషయంపై కూడా తెలియాల్సి ఉంది. ఒక వేళ ఇదే విషయం నిజమైతే… అమెరికాకు గట్టి షాక్ తగిలినట్లు అవుతుందనే పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe