ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురువారం (అక్టోబర్ 16) చేసిన ఓ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని వన్డే టీమ్.. ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్-బాల్ టూర్ కోసం పెర్త్లో దిగిన కొన్ని గంటలకే కోహ్లీ ఈ పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ ద్వారా అతడు తన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లి పోస్ట్ ఇలా..

విరాట్ కోహ్లి గురువారం (అక్టోబర్ 16) ఉదయం.. పట్టుదల, మైండ్సెట్ గురించి చెప్పే ఒక మెసేజ్ని షేర్ చేశాడు. ఓటమి అంటే వెనకడుగు వేయడం కాదని, ప్రయత్నించడం ఎప్పుడైతే ఆపేస్తామో అదే అసలైన ఓటమని అని అతడు అనడం విశేషం.
పట్టు వదలకుండా ప్రయత్నిస్తేనే సక్సెస్ వస్తుందని, తాను ఇప్పుడప్పుడే మొత్తంగా క్రికెట్ కు దూరమవడానికి తాను రెడీగా లేనని చెప్పకనే చెప్పినట్టు ఉంది ఆ పోస్ట్. ఆ ట్వీట్ ఇలా ఉంది.. "ప్రయత్నం ఆపేద్దాం అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, అప్పుడే నువ్వు నిజంగా ఓడిపోయినట్టు" అని విరాట్ అన్నాడు.
నిజానికి సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత బ్రాండ్ యాడ్స్ సంబంధించింది కాకుండా కోహ్లీ పెట్టిన మొదటి ట్వీట్ ఇదే కావడం గమనార్హం. నిజానికి కోహ్లీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. చివరిసారిగా ఇండియా ఇంగ్లాండ్ టూర్లో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. అప్పుడు బర్మింగ్హామ్, ఓవల్లో గిల్ కెప్టెన్సీలోని టెస్ట్ టీమ్ ఆడిన తీరును మెచ్చుకున్నాడు.
ఆస్ట్రేలియా టూర్ ఓ పరీక్షే
విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా సిరీస్ చాలా ముఖ్యమనే చెప్పాలి. అతని ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్యూచర్ గురించి గట్టిగా రూమర్స్ వస్తున్న టైమ్లో ఈ సోషల్ మీడియా పోస్ట్ వచ్చింది. 36 ఏళ్ల కోహ్లీ గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జూన్లో టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్ ప్రకటించడానికి రెండు వారాల ముందే టెస్ట్ క్రికెట్ నుంచి కూడా షాకింగ్గా తప్పుకున్నాడు. కోహ్లితోపాటు రోహిత్ కూడా ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు.
{{/usCountry}}విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా సిరీస్ చాలా ముఖ్యమనే చెప్పాలి. అతని ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్యూచర్ గురించి గట్టిగా రూమర్స్ వస్తున్న టైమ్లో ఈ సోషల్ మీడియా పోస్ట్ వచ్చింది. 36 ఏళ్ల కోహ్లీ గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జూన్లో టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్ స్క్వాడ్ ప్రకటించడానికి రెండు వారాల ముందే టెస్ట్ క్రికెట్ నుంచి కూడా షాకింగ్గా తప్పుకున్నాడు. కోహ్లితోపాటు రోహిత్ కూడా ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు.
{{/usCountry}}ఇద్దరినీ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్కి ఎంపిక చేయడంతో ఈ చర్చలన్నింటికీ ఫుల్స్టాప్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ని కెప్టెన్సీ నుంచి తీసేశారు. అటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ఇటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్లో వాళ్లు ఉంటారని కచ్చితంగా చెప్పలేదు. వాళ్ల ఏజ్ని, 50 ఓవర్ల ఫార్మాట్లో వాళ్లకు దొరికే తక్కువ మ్యాచ్లను చూసి, టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడే ఒక అంచనాకు రావడానికి రెడీగా లేదు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సిరీస్ ఇటు విరాట్, అటు రోహిత్ లకు కీలకం కానుంది. ఆస్ట్రేలియా సిరీస్ ఆ ఇద్దరికీ చివరి అంతర్జాతీయ సిరీస్ కాదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేయడం అభిమానులకు ఊరట కలిగించేదే. దీంతో ఈ మూడు మ్యాచ్ల సిరీస్తో పాటు, నవంబర్ 30న మొదలయ్యే సౌతాఫ్రికాతో హోమ్ సిరీస్, జనవరిలో న్యూజిలాండ్తో ఇంకో సిరీస్లో కూడా వాళ్లు తమ సత్తా నిరూపించుకునే అవకాశం ఉంటుంది.
టీమిండియా ఆస్ట్రేలియా టూర్
ఇండియన్ టీమ్ రెండు బ్యాచ్లుగా పెర్త్కి బయలుదేరింది. కోహ్లీ, రోహిత్, గిల్, శ్రేయస్ అయ్యర్, మరికొందరు బుధవారం (అక్టోబర్ 15) ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్లో ఉన్నారు. సాయంత్రం బయలుదేరిన బ్యాచ్లో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్-రౌండర్ అక్షర్ పటేల్, పేసర్ మహ్మద్ సిరాజ్ ఉన్నారు.
ఆస్ట్రేలియాకి లాంగ్ ఫ్లైట్ జర్నీ అవ్వడంతో ఇండియన్ టీమ్ గురువారం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. బహుశా శుక్రవారం (అక్టోబర్ 17) నుంచి వన్డే సిరీస్ కోసం తమ ట్రైనింగ్ మళ్లీ మొదలుపెట్టొచ్చు.