...
...
Next Story

హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ.. రూ.4,051 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్‌లోని కీలక మెట్రో జోన్‌లలో ఓవర్ హెడ్ విద్యుత్ పంపిణీ లైన్‌లను భూగర్భ కేబులింగ్ నెట్‌వర్క్‌గా మార్చడానికి రూ.4,051 కోట్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైంది.

Published on: Dec 01, 2025 11:27 AM IST
Advertisement

హైదరాబాద్ మెట్రో జోన్‌లో విద్యుత్ సరఫరా నాణ్యత, విశ్వసనీయతను పెంచేందుకు ఓవర్ హెడ్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌కు మార్చే భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన శాఖ జారీ చేసిన G.O.Ms.No.43 ప్రకారం, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సమర్పించిన ప్రతిపాదనను వివరణాత్మక పరిశీలన తర్వాత ఆమోదించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇందులో భాగంగా నగరంలోని మెట్రో జోన్‌లో ఓవర్ హెడ్ లైన్లను పూర్తిగా తొలగించి అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లను కవర్ చేస్తుంది. TGSPDCL 33kV, 11kV, లో-టెన్షన్ (LT) నెట్‌వర్క్‌లతో సహా ఇప్పటికే ఉన్న 3,899 కి.మీ ఓవర్ హెడ్ (OH) లైన్‌లను భూగర్భ కేబుల్‌లతో భర్తీ చేస్తారు.

అండర్ గ్రౌండ్ కేబులింగ్ నాణ్యతను పెంచుతుందని, అంతరాయాలను తగ్గిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. నెట్‌వర్క్‌ను భూగర్భంలోకి తీసుకురావడం వల్ల విశ్వసనీయత మెరుగుపడుతుందని, నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుందని, మెట్రో ప్రాంతంలో విద్యుత్ పంపిణీ మొత్తం సామర్థ్యాన్ని పెంచుతుందని ఆ ఉత్తర్వులో పేర్కొంది. మెరుగైన మౌలిక సదుపాయాలు పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని అంటోంది.

క్షేత్ర పరిస్థితులను బట్టి ట్రెంచ్-బేస్డ్ కేబులింగ్, హెచ్‌డీడీ కలయికను TGSPDCL ప్రతిపాదించింది. లేన్లు, ఇరుకైన ప్రాంతాలలో ఎల్టీ లైన్లు ఏరియల్ బండిల్డ్ కేబుల్‌తో భర్తీ చేస్తారు.

అంతర్గత నిధులు లేదా రుణం ద్వారా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి TGSPDCLకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉమ్మడి ట్రెంచింగ్‌లో ఖర్చు భాగస్వామ్యం కోసం టీ-ఫైబర్‌తో సహా టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయాలని కూడా ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని TGSPDCL ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe