ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలతో ఇటీవల సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. సరైన దిశలో వెళ్లడం లేదని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని, 8 మంది ఎంపీలు ఉన్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతున్నామని ప్రశ్నించినట్టుగా ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా కీలక అంశాలపై మోదీ దిశానిర్దేశం చేశారు. ఈ వార్తలపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని ప్రధాని మోదీ సూచనలు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం చేసింది మరొకటి అని పేర్కొన్నారు. నరేంద్రమోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీల సమావేశంపై వచ్చిన లీకుల మీద మండిపడ్డారు. 'మోదీతో చర్చించిన విషయాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరో కావాలనే లీక్ చేశారు. ఈ సమావేశంలో ప్రస్తావించిన విషయాలను బయటకు చెప్పకూడదని మోదీ చెప్పారు.' అని కిషన్ రెడ్డి అన్నారు.
మీటింగ్లో జరిగిన విషయాలను బయట ఎందుకు చెప్పారని కిషన్ రెడ్డి అడిగారు. వారెవరో చెబితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ సమావేశ వివరాలను లీక్ చేయడం కచ్చితంగా తప్పేనన్నారు. లీక్ వీరులు ఎవరో తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని మరింతగా బలోపేతం చేయాలని మోదీ చెప్పినట్టుగా వెల్లడించారు. దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉప రాష్ట్రపతులు అయ్యారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు.
అన్ని రాష్ట్రాల ఎంపీలతో భేటీ అయినట్టే తెలంగాణ బీజేపీ ఎంపీలను ప్రధాని మోదీ కలిశారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్గత వివరాలను బయటపెట్టడం పార్టీ ఐక్యతకు భంగం కలిగిస్తుందన్నారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని చెప్పారు.
{{/usCountry}}అన్ని రాష్ట్రాల ఎంపీలతో భేటీ అయినట్టే తెలంగాణ బీజేపీ ఎంపీలను ప్రధాని మోదీ కలిశారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్గత వివరాలను బయటపెట్టడం పార్టీ ఐక్యతకు భంగం కలిగిస్తుందన్నారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించారు. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండటం దేశానికి దురదృష్టకరమని చెప్పారు.
{{/usCountry}}'ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆయన అనైతికంగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ స్థాయిని తగ్గించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయి. రాహుల్ గాంధీ విపక్షనేతగా ఉండటం దురదృష్టకరం.' అని కిషన్ రెడ్డి అన్నారు.