2026-27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రైల్వే నెట్వర్క్ విస్తరణ కోసం ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి 2009-14 మధ్య చేసిన సగటు వార్షిక కేటాయింపులతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ అని మంత్రి వైష్ణవ్ అన్నారు.
హై స్పీడ్ రైళ్లు

ప్రతిపాదిత హై-స్పీడ్ రైలు కారిడార్లు-హైదరాబాద్-పుణే, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు.. వేగవంతమైన ప్రయాణ మార్గాల నెట్వర్క్ను ఏర్పరుస్తాయని చెప్పారు. ఇవి ప్రయాణ సమయాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా ఆర్థిక వృద్ధిని కూడా వేగవంతం చేస్తాయని వైష్ణవ్ అన్నారు.
ప్రయాణ సమయాల్లో మార్పులు
ఎలివేటెడ్ అలైన్మెంట్లు, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు, ఇతర భాగాలపై మరిన్ని వివరాలు తగిన సమయంలో పంచుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు. ఈ కారిడార్లలో ఆశించిన ప్రయాణ సమయాలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. హైదరాబాద్-బెంగళూరు: 2 గంటలు, హైదరాబాద్–చెన్నై: 2 గంటల 55 నిమిషాలు, హైదరాబాద్–పుణె: 1 గంట 55 నిమిషాల్లో వెళ్లవచ్చన్నారు.
ఏపీకి కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్కు రూ.10,134 కోట్లు లభించాయని, రూ.92,649 కోట్ల విలువైన పనుల పురోగతిలో ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో 2009–14 సగటుతో పోలిస్తే పదకొండు రెట్లు ఎక్కువ అని ఆయన అన్నారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై రెండు హై-స్పీడ్ కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తాయని తెలిపారు.
దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు
దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్రం వేగంగా చేపడుతోందని, జోనల్ కార్యాలయాల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని వైష్ణవ్ పేర్కొన్నారు. సిబ్బంది బదిలీలు, అధికార పరిధి విభాగాల ఏర్పాటు వంటి లాజిస్టిక్స్ కారణంగా కొత్త జోన్ను కార్యాచరణలోకి తీసుకురావడానికి సాధారణంగా మూడు నుండి నాలుగు సంవత్సరాలు పడుతుందన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం సహకారంతో ఈ పనిని వేగవంతం చేస్తున్నామని వివరించారు.
యాదాద్రి రైల్వే లింక్
అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. మూడు హై-స్పీడ్ రైలు సర్వీసులు హైదరాబాద్ నుండే ప్రారంభం కానున్నందున, వాటి నిర్వహణ డిపోకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. పునరుద్ధరించిన సికింద్రాబాద్ స్టేషన్లోని ప్రధాన భాగం, ముఖ్యంగా ప్లాట్ఫామ్ 10 వైపు.. మార్చి నాటికి సిద్ధమవుతుందని అన్నారు. 100 శాతం రైల్వే నిధులతో ఎంఎంటీఎస్ ఫేజ్-II యాదాద్రి రైల్వే లింక్ను త్వరలోనే చేపడతామని ఆయన చెప్పారు.
{{/usCountry}}అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. మూడు హై-స్పీడ్ రైలు సర్వీసులు హైదరాబాద్ నుండే ప్రారంభం కానున్నందున, వాటి నిర్వహణ డిపోకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. పునరుద్ధరించిన సికింద్రాబాద్ స్టేషన్లోని ప్రధాన భాగం, ముఖ్యంగా ప్లాట్ఫామ్ 10 వైపు.. మార్చి నాటికి సిద్ధమవుతుందని అన్నారు. 100 శాతం రైల్వే నిధులతో ఎంఎంటీఎస్ ఫేజ్-II యాదాద్రి రైల్వే లింక్ను త్వరలోనే చేపడతామని ఆయన చెప్పారు.
{{/usCountry}}