జనవరి 23 నుండి కడప జిల్లాలోని కొప్పర్తిలో జరగనున్న ‘దీని ఇజ్తిమా’కు హాజరయ్యే వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఈ ట్రైన్ గురించి మాట్లాడారు. సౌత్ సెంట్రల్ రైల్వే తెలంగాణలోని చర్లపల్లి నుండి తిరుపతి జిల్లాలోని తిరుచానూరు వరకు ఈ ప్రత్యేక రైలును నడుపుతుందని తెలిపారు. రైలు నెం. 07140 చర్లపల్లి-తిరుచానూరు రైలు జనవరి 22న చర్లపల్లిలో బయలుదేరుతుంది. నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు మీదుగా ప్రయాణించి ఉదయం 5.30 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. నంద్యాల నుండి ఈ రైలు కడప మీదుగా తిరుచానూరుకు చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07141 జనవరి 25న రాత్రి 11.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. తెల్లవారుజామున 3 గంటలకు కడపకు, ఉదయం 6.50 గంటలకు నంద్యాలకు చేరుకుని, చివరకు గుంటూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మీదుగా చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు ఇజ్తిమాకు వెళ్లే నంద్యాల వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని శబరి అన్నారు. ప్రత్యేక రైలును నడుపుతున్నందుకు దక్షిణ మధ్య రైల్వేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
'కడపలో జరగబోయే ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర దీని ఇజ్తిమ(జనవరి 23 నుంచి 25 వరకు)కు వేలాది మంది హాజరుకానున్న నేపథ్యంలో.. నంద్యాల మీదుగా రెండు దిశలలో స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇజ్తిమకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం South Central Railway అధికారులు రైలు నంబర్ 07140 / 07141లను ప్రత్యేకంగా నడపడం అభినందనీయం. నంద్యాల నుంచి దీని ఇజ్తిమకు వెళ్లే వారు ఈ స్పెషల్ ట్రైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నంద్యాల జిల్లా వాసులందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.' అని ఎంపీ శబరి ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఈ ప్రత్యేక రైలు చర్లపల్లిలో మెుదలవుతుంది. మౌలాలి, బొలారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, కృష్ణా, గుంటూరు జంక్షన్, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, తిరుచానూరులో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూరులో మెుదలై.. చర్లపల్లికి వెళ్తుంది.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైలు చర్లపల్లిలో మెుదలవుతుంది. మౌలాలి, బొలారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, కృష్ణా, గుంటూరు జంక్షన్, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, తిరుచానూరులో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో తిరుచానూరులో మెుదలై.. చర్లపల్లికి వెళ్తుంది.
{{/usCountry}}