Mallareddy Disproportionate Assets Case : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి వణుకు పుట్టించింది. తాజాగా నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్న జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఒకేసారి ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించింది. ఈ సోదాల్లో విస్తుపోయేలా మల్లారెడ్డి సంపాదించిన భారీ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
- 4 నివాస గృహాలు (ఇళ్లు), ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బ్లాక్
- వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది ఓపెన్ ప్లాట్లు
- 10.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమి
- ఇంట్లో దొరికిన రూ. 3.31 లక్షల నగదు
- వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్
వీటితో పాటు నిందితుడైన ఎక్సైజ్ అధికారి భార్య, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మూడు బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ లాకర్లను త్వరలోనే తెరిచి సోదాలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే తనిఖీల్లో ఒక కారు, ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం జరిపిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల ప్రభుత్వ విలువ సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. అయితే….. బహిరంగ మార్కెట్లో ఈ స్థిరాస్తుల విలువ (మార్కెట్ వాల్యూ) రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న విలువ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
మల్లారెడ్డికి సంబంధించి మరికొన్ని అదనపు ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని,.. వాటికి సంబంధించిన మరింత సమాచారం మరియు ధృవీకరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ఏసీబీ తెలిపింది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని… పట్టుబడిన ఎక్సైజ్ అధికారి కె. మల్లారెడ్డిని హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}మల్లారెడ్డికి సంబంధించి మరికొన్ని అదనపు ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని,.. వాటికి సంబంధించిన మరింత సమాచారం మరియు ధృవీకరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ఏసీబీ తెలిపింది. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని… పట్టుబడిన ఎక్సైజ్ అధికారి కె. మల్లారెడ్డిని హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}