వ్యవసాయ, ఉద్యానవన రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా సరికొత్త అడుగు పడింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ కాలేజీలో 'డ్రోన్ టెక్నాలజీ'పై ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ కె. ధనంజయ రావు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయం, ఉద్యానవన రంగంలో డ్రోన్ ఆధారిత సాంకేతికతకు రోజురోజుకూ ప్రాధాన్యత పెరుగుతోందని నొక్కి చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పంటల పర్యవేక్షణ, ప్రెసిషన్ ఫార్మింగ్, ల్యాండ్ మ్యాపింగ్, పరిశోధన కార్యకలాపాలు, సమర్థవంతమైన ఫారమ్ మేనేజ్మెంట్ కోసం మానవరహిత వైమానిక వాహనాలు(UAVs - డ్రోన్లు) ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించారు.
సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుండి డిజిటల్ వ్యవసాయం వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శిక్షణ విద్యార్థులకు పలు రకాలుగా ఉపయోగపడనుంది. కేవలం డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా, చేతిలో డ్రోన్ పైలట్ లైసెన్స్ లేదా డ్రోన్ టెక్నాలజీపై పట్టు ఉన్న అగ్రి/హార్టికల్చర్ విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీలలో, అగ్రి-టెక్ స్టార్టప్లలో భారీ డిమాండ్ ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు స్వయంగా 'అగ్రి-ప్రెన్యూర్స్' (ఉపాధి కల్పించే స్థాయికి) గా ఎదగవచ్చు.
ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు డ్రోన్లను ఉపయోగించి. ఎకరా పొలంలో ఏ ప్రాంతంలో తెగుళ్లు ఉన్నాయో కచ్చితంగా గుర్తించవచ్చు. తక్కువ నీరు, తక్కువ పురుగుమందులతో ఎక్కువ విస్తీర్ణంలో సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చు. మట్టిలోని తేమ శాతం, పంట దిగుబడి అంచనాలను సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కించడం నేర్చుకుంటారు.
తోటల పెంపకంలో చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల వాటిపై పురుగుమందుల పిచికారీ చేయడం రైతులకు పెద్ద సవాలుగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో కొబ్బరి, మామిడి, ఆయిల్ పామ్ వంటి తోటలలో కేవలం కొన్ని నిమిషాల్లోనే శ్రమ లేకుండా పిచికారీ పూర్తి చేయవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గిస్తుంది.
{{/usCountry}}తోటల పెంపకంలో చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల వాటిపై పురుగుమందుల పిచికారీ చేయడం రైతులకు పెద్ద సవాలుగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో కొబ్బరి, మామిడి, ఆయిల్ పామ్ వంటి తోటలలో కేవలం కొన్ని నిమిషాల్లోనే శ్రమ లేకుండా పిచికారీ పూర్తి చేయవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గిస్తుంది.
{{/usCountry}}వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యాన రంగంలో సాంకేతిక విప్లవం రానుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ అధ్యాపకులు సూచించారు.