ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUA) అనంతపురం ఒక సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. జర్మనీకి చెందిన ప్రముఖ 'రైట్లింగెన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీ'తో జెఎన్టియూఏ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుండి ఈ ఇంటిగ్రేటెడ్ B.Tech-MS కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఒకే సమయంలో JNTUA, జర్మన్ విశ్వవిద్యాలయం నుండి డ్యూయల్ డిగ్రీలను పొందే అవకాశం లభిస్తుంది.

ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కింద విద్యార్థులు తమ మొదటి నాలుగేళ్ల చదువును జేఎన్టీయూ అనంతపురంలో పూర్తి చేస్తారు. ఆపై చివరి (ఐదో) సంవత్సరాన్ని జర్మనీలో చదవాల్సి ఉంటుంది. సాధారణంగా B.Tech, MS పూర్తి చేయడానికి ఆరేళ్లు పడుతుంది. కానీ ఈ విధానం ద్వారా ఐదేళ్లలోనే రెండు డిగ్రీలను పూర్తి చేయవచ్చని వర్సిటీ వెల్లడించింది.
అందించే కోర్సులు ఇవే
B.Tech (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) + MS (ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్)
B.Tech (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) + MS (డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్)
100 శాతం ప్లేస్మెంట్స్
ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు అధునాతన యూరోపియన్ టెక్నాలజీలపై పట్టు సాధించే అవకాశం లభించడమే కాకుండా, యూరప్ వ్యాప్తంగా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శన రావు తెలిపారు.
'ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలు ఉంటాయి. ఈ చొరవ ద్వారా విద్యార్థులకు 100 శాతం ప్లేస్మెంట్ కల్పిస్తామనే నమ్మకం మాకుంది. అంతేకాకుండా జర్మనీలో విడిగా ఎంఎస్ చేయడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే.. ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా 60 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుంది.' అని వీసీ సుదర్శన రావు వివరించారు.
అర్హత ప్రమాణాలు
ఇంటర్మీడియట్, సీబీఎస్ఈ లేదా ICSE సిలబస్లో MPC (గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం) స్ట్రీమ్లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అడ్మిషన్లకు అర్హులు. జెఎన్టీయూఎ ఫారిన్ ఎడ్యుకేషన్ అఫైర్స్ డైరెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం ఇప్పటికే స్వీడన్ యూనివర్సిటీతో కలిసి విజయవంతంగా కోర్సులను అందిస్తోందని, రాబోయే విద్యాసంవత్సరం నుండి ఈ సరికొత్త జర్మన్ ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
{{/usCountry}}ఇంటర్మీడియట్, సీబీఎస్ఈ లేదా ICSE సిలబస్లో MPC (గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం) స్ట్రీమ్లో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ అడ్మిషన్లకు అర్హులు. జెఎన్టీయూఎ ఫారిన్ ఎడ్యుకేషన్ అఫైర్స్ డైరెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం ఇప్పటికే స్వీడన్ యూనివర్సిటీతో కలిసి విజయవంతంగా కోర్సులను అందిస్తోందని, రాబోయే విద్యాసంవత్సరం నుండి ఈ సరికొత్త జర్మన్ ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
{{/usCountry}}ఈ కోర్సులకు సంబంధించిన మరింత సమాచారం, ఇతర వివరాల కోసం అభ్యర్థులు 7288733337 నంబర్లో సంప్రదించవచ్చు.