Azadi 501 OTT: డిజిటల్ విప్లవం మొదలవుతున్న రోజుల్లో ఒక చిన్న మొబైల్ ఫోన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రూ.251కే ఫోన్ అంటూ పెద్ద స్కామ్ జరిగింది. ఆ కుంభకోణం వెనుక ఉన్న మిస్టరీ కథను ప్రపంచానికి చెప్పేందుకు ‘ఆజాదీ 501’ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.
ఆజాదీ 501 ఓటీటీ డేట్

ఇండియాలో రియల్ టెక్ స్కామ్ కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ఆజాదీ 501’. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో ఈ సిరీస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. జూలై 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ఆహా వీడియో తాజాగా అనౌన్స్ చేసింది.
రూ.251కే స్మార్ట్ ఫోన్
ఒకప్పుడు కేవలం రూ. 251లకే స్మార్ట్ఫోన్ ఇస్తామంటూ కోట్ల మందిని నమ్మించి, ఆ తర్వాత రాత్రికి రాత్రే అదృశ్యమైన ఆ భారీ మోసపూరిత కథే ‘ఆజాది 501’. ఈ సిరీస్లో ఆ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఆ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్మైండ్ ఐడియాలజీ ఏంటి? అనేది చూపించనున్నారు.
చివరకు చట్టానికి ఎలా దొరికిపోయారు అనే సస్పెన్స్ ఎలిమెంట్స్తో దర్శకుడు వంశీ రంగిశెట్టి దీనిని ఒక గ్రిప్పింగ్ క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్గా మలిచారు.
ఎందుకు చూడాలంటే?
‘స్కామ్ 1992’, ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వంటి ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామాలకు ఇండియన్ ఓటీటీ స్పేస్లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రేక్షకులు కేవలం నేరాన్ని మాత్రమే చూడరు.. ఆ నేరం వెనుక ఉన్న లూప్హోల్స్ను, హ్యూమన్ సైకాలజీని డీకోడ్ చేయడానికి ఇష్టపడతారు.
ఇప్పటివరకు రొటీన్ లవ్ స్టోరీలు, హారర్ జోనర్లపై ఫోకస్ పెట్టిన ‘అహా’.. ఈసారి ఇలాంటి ఒక రా అండ్ రియలిస్టిక్ కార్పొరేట్ స్కామ్ను ఎంచుకోవడం ఖచ్చితంగా ఒక తెలివైన స్ట్రాటజీ. ఇది నెట్ఫ్లిక్స్ లేదా సోనీలివ్ తరహా మెచ్యూర్డ్ థ్రిల్లర్ ఆడియన్స్ను ‘అహా’ వైపు తిప్పుకునేలా చేస్తుంది.
వంశీ రంగిశెట్టి మార్క్ మేకింగ్
{{/usCountry}}ఇప్పటివరకు రొటీన్ లవ్ స్టోరీలు, హారర్ జోనర్లపై ఫోకస్ పెట్టిన ‘అహా’.. ఈసారి ఇలాంటి ఒక రా అండ్ రియలిస్టిక్ కార్పొరేట్ స్కామ్ను ఎంచుకోవడం ఖచ్చితంగా ఒక తెలివైన స్ట్రాటజీ. ఇది నెట్ఫ్లిక్స్ లేదా సోనీలివ్ తరహా మెచ్యూర్డ్ థ్రిల్లర్ ఆడియన్స్ను ‘అహా’ వైపు తిప్పుకునేలా చేస్తుంది.
వంశీ రంగిశెట్టి మార్క్ మేకింగ్
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్కు ప్రధాన బలం దీని కాస్టింగ్. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే టాలెంటెడ్ యాక్టర్ హర్షవర్ధన్, ఇంటెన్స్ రోల్స్కు కేరాఫ్ అడ్రస్ అయిన శశాంక్ ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేశారు. వీరితో పాటు డి. గీతా భాస్కర్, రవివర్మ, రాకీ కృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
థర్స్డే సినిమాస్ (Thursday Cinemas) బ్యానర్పై ప్రొడ్యూసర్ రచన రెడ్డి ములుముడి ఈ సిరీస్ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మించారు. యథార్థ గాథలను, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు 'ఆజాది 501' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.