Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పాడు. ఫ్యామిలీ లైఫ్ ను స్టార్ట్ చేశాడు. ఈ టాలీవుడ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి కావ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం తిరుమలలో ఘనంగా జరిగింది.
బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి తిరుమలలో జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వీళ్ల వెడ్డింగ్ ను గ్రాండ్ గా నిర్వహించారు. బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి 11 గంటల 13 నిమిషాల ముహూర్తానికి తిరుమలలోని కర్ణాటక అతిథి భవనం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో వీళ్ల పెళ్లి జరిగింది.
బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి పెళ్లికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గ్రాండ్ గా రిసెప్షన్
మూడు ముళ్లతో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి ఒక్కటయ్యారు. ఈ జంట హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనుంది. మే 1న ఈ రిసెప్షన్ జరగనుందని తెలిసింది. ఈ రిసెప్షన్ కు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలు అటెండ్ కాబోతున్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, చిరంజీవి లాంటి దిగ్గజ నటులతో సహా చాలా మంది ప్రముఖులను బెల్లంకొండ శ్రీనివాస్ తన పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
బెల్లంకొండ శ్రీనివాస్ భార్య ఎవరు?
{{/usCountry}}మూడు ముళ్లతో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి ఒక్కటయ్యారు. ఈ జంట హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనుంది. మే 1న ఈ రిసెప్షన్ జరగనుందని తెలిసింది. ఈ రిసెప్షన్ కు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలు అటెండ్ కాబోతున్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, చిరంజీవి లాంటి దిగ్గజ నటులతో సహా చాలా మంది ప్రముఖులను బెల్లంకొండ శ్రీనివాస్ తన పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
బెల్లంకొండ శ్రీనివాస్ భార్య ఎవరు?
{{/usCountry}}బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం జరిగిన నేపథ్యంలో అతని భార్య కావ్య రెడ్డి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కావ్యకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయం కానీ, సంబంధం కానీ లేదు.
కావ్య రెడ్డి తాత గతంలో జడ్జిగా పనిచేశారని అంటున్నారు. ఆమె తండ్రి ఓ లాయర్ అని తెలిసింది. శ్రీనివాస్, కావ్య పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసిందని టాక్. ఏప్రిల్ 6న హైదరాబాద్ లో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సినిమా సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు.
సినిమాలతో బిజీ
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మూడు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. టైసన్ నాయుడు, హైందవ, రామం సినిమాల్లో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ చేస్తున్న మూడు సినిమాలు కూడా స్టోరీ పరంగా దేనికదే డిఫరెంట్ గా ఉంది. గతేడాది ‘కిష్కింధపురి’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.