Drishyam 3 Movie First Day Box Office Collection: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'దృశ్యం 3' మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మోహన్ లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం, రెండో భాగం సాధించిన అద్భుత విజయాల తర్వాత వచ్చిన ఈ మూడో భాగం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఖాతా తెరిచింది.

తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ ఫ్రాంచైజీతో విడదీయరాని బంధం ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ అయిన 'దృశ్యం' సినిమాలు ఇక్కడ కూడా సంచలన విజయాలు సాధించాయి. అందుకే మలయాళ మూల చిత్రం 'దృశ్యం 3' తెలుగు వర్షన్పై కూడా ఇక్కడి సినీ ప్రియులు గట్టి ఆశలే పెట్టుకున్నారు.
మొదటి రోజు వసూళ్ల వివరాలు
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'దృశ్యం 3' మొదటి రోజు భారతదేశ వ్యాప్తంగా రూ. 10.56 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 5,396 షోలలో ఈ సినిమాను ప్రదర్శించారు. భాషల వారీగా చూస్తే, మాతృభాష మలయాళంలో అత్యధికంగా రూ. 9.11 కోట్లు రాగా, తెలుగులో రూ. 0.96 కోట్లు, తమిళంలో రూ. 0.36 కోట్లు, కన్నడలో రూ. 0.13 కోట్ల కలెక్షన్లు నమోదయ్యాయి.
పాత రికార్డులతో పోలిక
మొదటి రోజు థియేటర్లలో సగటున దృశ్యం 3 సినిమాకు 50.5 శాతం అక్యుపెన్సీ కనిపించింది. వీకెండ్ వచ్చేసరికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మోహన్ లాల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ ఓపెనింగ్స్ మెరుగ్గానే ఉన్నాయని చెప్పాలి.
గత ఏడాది (2025) విడుదలైన ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ 'L2: ఎంపురాన్' మొదటి రోజే రూ. 21 కోట్ల భారీ వసూళ్లను సాధించి అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డును 'దృశ్యం 3' అందుకోలేకపోయినప్పటికీ, మోహన్ లాల్ ఇటీవలి చిత్రాలైన 'తుడరుమ్' (రూ. 5.45 కోట్లు), 'హృదయపూర్వం' (రూ. 3.25 కోట్లు), 'వృషభ' (రూ. 0.60 కోట్లు) చిత్రాల ఓపెనింగ్స్ను దృశ్యం 3 సులభంగా అధిగమించింది.
{{/usCountry}}గత ఏడాది (2025) విడుదలైన ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ 'L2: ఎంపురాన్' మొదటి రోజే రూ. 21 కోట్ల భారీ వసూళ్లను సాధించి అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డును 'దృశ్యం 3' అందుకోలేకపోయినప్పటికీ, మోహన్ లాల్ ఇటీవలి చిత్రాలైన 'తుడరుమ్' (రూ. 5.45 కోట్లు), 'హృదయపూర్వం' (రూ. 3.25 కోట్లు), 'వృషభ' (రూ. 0.60 కోట్లు) చిత్రాల ఓపెనింగ్స్ను దృశ్యం 3 సులభంగా అధిగమించింది.
{{/usCountry}}2013లో వచ్చిన మొదటి భాగం దృశ్యం మూవీ మలయాళ సినిమా చరిత్రలోనే తొలిసారిగా రూ. 50 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టిస్తే.. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం కొవిడ్ మహమ్మారి కారణంగా నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది.
రివ్యూలు ఏం చెబుతున్నాయి?
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబావూర్ దృశ్యం 3 చిత్రాన్ని నిర్మించారు. మోహన్ లాల్, మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, మురళీ గోపీ, సిద్ధిఖీ, ఆశా శరత్ తమ పాత పాత్రల్లోనే మరోసారి కనిపించి మెప్పించారు. జార్జ్కుట్టి కుటుంబాన్ని చుట్టుముట్టిన సమస్యలు ఈ భాగంలో ఎలా ముగిసాయనేది కథాంశం.
"దృశ్యం 3 కేవలం ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేయడంపై కాకుండా, జార్జ్కుట్టి చుట్టూ ఉన్న పరిస్థితులు, అతను తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది" అని హిందుస్థాన్ టైమ్స్ తన రివ్యూలో పేర్కొంది.
దృశ్యం 4 కూడా
కూతురిని కాపాడుకోవడానికి ఒక తండ్రి ఎంతటి సాహసానికైనా వెనుకాడడనే పాయింట్ను ఇందులో భావోద్వేగంగా చూపించారు. ఈ సినిమా ముగింపు చూస్తుంటే 'దృశ్యం 4' కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోహన్ లాల్ సైతం ఈ సిరీస్లో ఐదో భాగం కూడా ఉండే అవకాశం ఉందని గతంలోనే హింట్ ఇచ్చారు. జార్జ్కుట్టి ప్రయాణం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.