దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్, ట్యాక్సీ డ్రైవర్లు వంటి గిగ్, ప్లాట్ఫారమ్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం గళమెత్తుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. కొత్త ఏడాది వేడుకల సమయంలో మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. కేంద్ర కార్మిక శాఖ ఈ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.

దీని ప్రకారం, గిగ్ వర్కర్లు ప్రభుత్వ సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను పొందాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
90 రోజుల నిబంధన ఏంటి?
కేంద్రం విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఒక గిగ్ వర్కర్ సామాజిక భద్రత ప్రయోజనాలకు అర్హత సాధించాలంటే:
- ఏదైనా ఒక సంస్థలో (అగ్రిగేటర్) ఆర్థిక సంవత్సరంలో కనీసం 90 రోజుల పాటు పనిచేసి ఉండాలి.
- ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో పనిచేస్తుంటే, ఏడాదికి కనీసం 120 రోజులు పని పూర్తి చేసి ఉండాలి.
'పని దినం' లెక్క ఎలా?
ఒక రోజు పనిని ఎలా లెక్కిస్తారు అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
"ఏదైనా ఒక క్యాలెండర్ రోజున సదరు సంస్థ ద్వారా వర్కర్ ఎంత ఆదాయం సంపాదించినా సరే, ఆ రోజును ఒక పని దినంగానే పరిగణిస్తాం" అని ప్రభుత్వం వివరించింది.
ఒకవేళ ఒక వర్కర్ ఒకే రోజున మూడు వేర్వేరు సంస్థల (ఉదాహరణకు జొమాటో, స్విగ్గీ, ఉబెర్) తరపున పనిచేస్తే.. ఆ ఒక్క రోజును మూడు పని దినాలుగా గుర్తిస్తారు.
ఈ వెసులుబాటు వల్ల వర్కర్లు తమ 90 లేదా 120 రోజుల లక్ష్యాన్ని సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. అగ్రిగేటర్ కంపెనీ నేరుగా నియమించుకున్నా లేదా థర్డ్ పార్టీ ద్వారా పని చేస్తున్నా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
ఈ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
అసంఘటిత రంగ కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వర్కర్కు ఫోటోతో కూడిన డిజిటల్ ఐడెంటిటీ కార్డును జారీ చేస్తారు.
- ఇప్పటికే 'ఈ-శ్రమ్' (e-Shram) పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీని ద్వారానే కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతాయి.
- కార్మికులు తమ అడ్రస్, మొబైల్ నంబర్, వృత్తి వంటి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అలా చేయని పక్షంలో పథకాలకు అనర్హులు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
అసంఘటిత రంగ కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
- రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వర్కర్కు ఫోటోతో కూడిన డిజిటల్ ఐడెంటిటీ కార్డును జారీ చేస్తారు.
- ఇప్పటికే 'ఈ-శ్రమ్' (e-Shram) పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీని ద్వారానే కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలు అందుతాయి.
- కార్మికులు తమ అడ్రస్, మొబైల్ నంబర్, వృత్తి వంటి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అలా చేయని పక్షంలో పథకాలకు అనర్హులు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రస్తుతం ఈ నిబంధనలు ముసాయిదా దశలో ఉన్నాయి. ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. వేల సంఖ్యలో ఉన్న గిగ్ వర్కర్ల జీవితాల్లో ఈ నిర్ణయం భద్రతను నింపుతుందని ఆశించవచ్చు.