...
...
Next Story

స్వచ్ఛమైన గాలి కోసం దిల్లీ ప్రజల నిరసనలు- నిర్బంధించిన పోలీసులు..

దిల్లీ వాయు కాలుష్యం సమస్యపై స్థానికులు గళం విప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో పెద్ద ఎత్తున్న ప్రదర్శన చేశారు. చివరికి పోలీసులు వారిని నిర్భంధించారు.

Published on: Nov 10, 2025 05:46 AM IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిపోవడంతో ఆదివారం నాడు ఇండియా గేట్ సమీపంలోని మాన్​సింగ్ రోడ్డులో పిల్లలతో సహా స్థానికులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. "పొగమంచు నుంచి ఆజాది!", "శ్వాస తీసుకోవడం కూడా మమ్మల్ని చంపేస్తోంది" వంటి నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నిరసన సమయంలో దిల్లీ వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 370కి చేరుకుని, 'చాలా నాసిరకం' కేటగిరీలో నమోదైంది.

దిల్లీ నిరసన దృశ్యాలు.. (PTI)
దిల్లీ నిరసన దృశ్యాలు.. (PTI)

"ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి, ఇది నిందలు వేసుకునే సమయం కాదు. ప్రభుత్వ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ పద్ధతి మా పిల్లలను దెబ్బతీసింది. ప్రభుత్వం వెంటనే స్వచ్ఛమైన గాలి విధానాన్ని అమలు చేయాలి," అని ఒక నిరసనకారులు డిమాండ్​ చేశారు.

'నిరుపేదలే ఎక్కువ నష్టపోతున్నారు'

చేతితో తయారుచేసిన “హవా సర్కారీ నహీ, సబ్‌కా హై” (గాలి ప్రభుత్వ ఆస్తి కాదు, అది అందరిదీ) అనే బ్యానర్‌ను ఊపుతూ ఒక నిరసనకారుడు మాట్లాడుతూ.. "డబ్బు ఉన్నవారు ఎయిర్ ప్యూరిఫైయర్‌లను కొనుగోలు చేయగలరు లేదా కొండ ప్రాంతాలకు పారిపోగలరు. కానీ మా పరిస్థితి ఏంటి? ప్రతి చలికాలం కేవలం శ్వాస తీసుకోవడం కోసమే మేము పోరాడాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో నిరసనకారురాలు జ్యోత్స్నా సింగ్ మాట్లాడుతూ.. "నిరుపేదలు – రోడ్డు పక్కన వ్యాపారులు, ఆటో డ్రైవర్లు – రోడ్డు కాలుష్యం కారణంగా ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ కాలుష్యానికి దాదాపు 80% వరకు ప్రభుత్వ బస్సులు, ఆటోలే కారణం. వాహనాలు సమస్యే, అవును. కానీ బీజింగ్ చేసినట్లుగా 2030 నాటికి సామూహిక రవాణా వాటాను 50%కి పెంచడం వంటి ప్రభుత్వ జోక్యం లేకుండా పౌరులు ఎలా మెరుగుపడగలరు? ఈ పక్కదారి పట్టించే చర్యలు కేవలం విధానపరమైన లోపాలను దాచిపెడుతున్నాయి," అని పేర్కొన్నారు.

'రాజకీయం కాదు, ప్రజల ఆరోగ్యమే ముఖ్యం'

"ప్రభుత్వం ఇచ్చే ఏక్యూఐ డేటా ఇకపై నిజమేనా?" అని ఇంకొకరు ప్రశ్నించారు. "కాలుష్యం పెరిగిన వెంటనే ఏక్యూఐ పర్యవేక్షణ కేంద్రాల దగ్గర నీళ్లు చల్లే వీడియోలు చూసిన తర్వాత నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఎవరైనా సంఖ్యలను తారుమారు చేస్తున్నారా లేక కేవలం ఫేక్​ చేయడానికి నీటిని వృథా చేస్తున్నారా?" అని అనుమానం వ్యక్తం చేశారు.

వసంత్ కుంజ్‌కు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు, మాట్లాడటానికి కష్టపడుతూ.. తన మాస్క్‌ను కొద్దిసేపు కిందకు దించి, "ప్రభుత్వాలు మారతాయి, కానీ ప్రజలు మాత్రం బాధపడుతూనే ఉంటారు. నా మనవళ్ల గురించి నాకు ఆందోళనగా ఉంది. ఎక్కడికక్కడ నిర్మాణాలు అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నాయి, మన పచ్చదనం కనుమరుగైపోతోంది," అని అన్నారు.

"నేను నా స్నేహితులతో దిల్లీలోనే ఉండాలి, స్కూల్‌కు వెళ్లాలి! శ్వాస తీసుకోడానికి మాకు సహాయం చేయండి," అని ఓ చిన్నారి రాసిన ప్లకార్డును ప్రదర్శించింది.

నిరసనకారుల నిర్బంధం

నిరసన తీవ్రమవుతున్న తరుణంలో, దిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. నిరసన శాంతియుతంగా ఉన్నప్పటికీ, కేవలం నినాదాలు, ప్లకార్డులు మాత్రమే ప్రదర్శించినా, పిల్లలతో పాటు పలువురు నిరసనకారులను నిర్బంధించారు.

"మేము ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరాము కానీ నిరాకరించారు. మా పిల్లలు బాధపడుతున్నందున చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చారు. ఇది రాజకీయాల గురించి కాదు, స్వచ్ఛమైన గాలి గురించి," అని నిరసనకు నాయకత్వం వహించిన ప్రముఖ పర్యావరణవేత్త భవరీన్ కంధారి అన్నారు.

నిరసన నిర్వాహకులు, నిరసన జరగకుండా అడ్డుకునేందుకు మూడు రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ వరకు దాదాపు 100 కాల్స్ చేసి, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని బెదిరించారని ఆరోపించారు. అయితే, డీసీరీ (న్యూ దిల్లీ) దేవేష్ కుమార్ మహ్లా ఈ నిర్బంధాలను "ముందస్తు చర్యలు"గా అభివర్ణించారు.

చట్టం, భద్రత దృష్ట్యా ఈ నిర్బంధాలను సమర్థిస్తూ, ఒక సీనియర్ అధికారి, "ఇండియా గేట్ వద్ద నిరసన చేయడానికి అనుమతి ఇవ్వలేదు" అని తెలిపారు. "భద్రతను కొనసాగించడానికి, కొందరిని నిర్బంధించాం. జంతర్ మంతర్ మాత్రమే నిరసనల కోసం నిర్దేశించిన ప్రాంతం, అది కూడా సరైన విధానాన్ని అనుసరించి చేయాలి," అని డీసీపీ మహ్లా అన్నారు. దిల్లీ పోలీసులు బీఎన్​ఎస్​ఎస్​లోని సెక్షన్ 163 కింద ఉత్తర్వులు జారీ చేసి, ఆ ప్రాంతంలో గుమిగూడటాన్ని నిషేధించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe