...
...
Next Story

అయోధ్య రామ మందిరంపై 'ధర్మ ధ్వజం' ఎగురవేసిన ప్రధాని మోదీ

పది అడుగుల ఎత్తైన ధర్మ ధ్వజాన్ని అయోధ్య రామ మందిరంపై ఎగురవేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం. ఈ పవిత్ర జెండా సూర్యుడు, 'ఓం', కోవిందార వృక్షం చిత్రాలను కలిగి ఉంది. ఈ చర్యతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తైంది.

Published on: Nov 25, 2025 01:03 PM IST
Advertisement

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యలోని రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ చర్యతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లుగా ప్రకటించారు. 'ధర్మ ధ్వజం' అని పిలిచే ఈ పది అడుగుల ఎత్తైన జెండాపై సూర్యుని చిత్రం, 'ఓం' అక్షరాలు, కోవిందార వృక్షం చిత్రం ఉన్నాయి.

రామ మందిరంపై జెండా రెపరెపలు.. (Deepak Gupta/Hindustan Times)
రామ మందిరంపై జెండా రెపరెపలు.. (Deepak Gupta/Hindustan Times)

ఈ పవిత్ర జెండా గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని అందిస్తుందని, ఇది రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది అని ప్రధానమంత్రి కార్యాలయం ముందుగా ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్య అతిథులు, రామరాజ్యం ఆదర్శాలు

తొలుత, ప్రధాని మోదీ మంగళవారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలోని రామ్ లల్లా గర్భ గృహంలో పూజలు నిర్వహించారు. అలాగే, ఆయన మాత అన్నపూర్ణ మందిరం, సప్తమందిరంలో కూడా ప్రార్థనలు చేశారు. సప్తమందిరంలో మహర్షి వశిష్ఠుడు, మహర్షి విశ్వామిత్రుడు, మహర్షి అగస్త్యుడు మహర్షి వాల్మీకికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. ఆ తర్వాత జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈ ఆలయం "140 కోట్ల మంది భారతీయుల విశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రతీక" అని అన్నారు. "ఈ జెండా ధర్మానికి ఉన్న కాంతి శాశ్వతమని, రామరాజ్య సూత్రాలు కాలాతీతమైనవని రుజువు చేస్తుంది," అని ఆయన జోడించారు.

అభిజిత్ ముహూర్తంలో జెండా ఆవిష్కరణ

సూర్యుడు ఉదయించడానికి ప్రతీకగా ఈ జెండా నిలుస్తుందని, ఇది త్యాగం, అంకితభావానికి సంకేతం అని ఆయన వివరించారు.

ప్రతి ఆరు నెలలకు జెండా మార్పు

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ జెండాను సంవత్సరానికి రెండుసార్లు—వసంత, శరదృతువు నవరాత్రుల సమయంలో మార్చాలని నిర్ణయించింది. ఈ జెండాను ప్రత్యేకమైన పారాచూట్ ఫ్యాబ్రిక్, పట్టు దారాలతో తయారు చేశారని, ఇది ఎండ, వర్షం, బలమైన గాలులను తట్టుకోగలదని ట్రస్ట్ చెప్పింది.

2024 లోక్​సభ ఎన్నికలకు ముందు, జనవరిలో ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe