...
...
Next Story

విశాఖపట్నం : అప్పన్న స్వామిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు - ఫొటోలు

విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఫొటోలు ఇక్కడ చూడండి….

Published on: Jan 28, 2026, 15:33:12 IST
Advertisement
<p>విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. </p>

విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్‌ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.

టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్వామివారిని దర్శించుకున్నారు.

కప్పస్తంభం ఆలింగనం చేసుకొని అంతరాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత జట్టుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ ప్రకారం కప్పస్తంభం ఆలింగనం చేసిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను జట్టు సభ్యులకు వివరించారు. పూజ అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, స్వామివారి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను ఆలయ అధికారులు భారత క్రికెట్ జట్టు సభ్యులకు అందజేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe