రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదలైన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయి. వచ్చే 45 రోజుల్లోగా రైతులందరి ఖాతాల్లోకి నిధులు చేరిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో మెుత్తం 73 లక్షల మంది అన్నదాతలు ఉన్నారు. ఒక ఎకరం వరకు సాయం అందించేలా రూ.3590 కోట్లను విడుదల చేశారు. ఆదివారం సెలవు కారణంగా సోమవారం(ఇవాళ) రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2650 కోట్లు, మూడో విడుతలో రూ.2760 కోట్లను విడుదల చేస్తారు. మొత్తం 3 విడతల ద్వారా… రూ. 9 వేల కోట్లను జమ చేస్తారు.
కొత్త దరఖాస్తులకు అవకాశం:
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రైతు భరోసా పథకంలో లబ్ధిపొందని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు మరో అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు… మార్చి 25వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలని సూచించింది.
- కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
- గతంలో రైతుబంధుకు దరఖాస్తు చేసి ఇప్పుడు బ్యాంకు ఖాతా నెంబరును మార్చుకునే వారు దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా అధికారులకు అందజేయాలి.
- పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాలి
- అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
- కొత్త దరఖాస్తుల వివరాలను కూడా వెంటనే నమోదు చేసి లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని ఏఈవోలు, వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
- కొత్త దరఖాస్తులను పరిశీలించి… వారికి కూడా రైతుబంధు స్కీమ్ డబ్బులను అందజేస్తారు.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా జమకాని రైతులకు, లేదా ఇటీవలే కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకున్న రైతులకు రెండవ విడతలో నిధులు జమ అవుతాయి.
{{/usCountry}}రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా జమకాని రైతులకు, లేదా ఇటీవలే కొత్తగా రైతు భరోసాకు అప్లై చేసుకున్న రైతులకు రెండవ విడతలో నిధులు జమ అవుతాయి.
{{/usCountry}}