ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ సర్కార్… మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం మొదటి సంవత్సరం (First Year) విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఇంప్రూవ్మెంట్’ పరీక్షలను సెకండియర్ విద్యార్థులకు కూడా అమలు చేయనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

దేశంలోని ఇతర రాష్ట్రాల ఇంటర్ బోర్డులు అనుసరిస్తున్న విద్యా విధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం…. విద్యార్థులకు మేలు చేకూర్చే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ నిర్ణయంతో పైచదువుల ప్రవేశాల్లో (EAPCET, JEE, NEET వంటివి) మార్కుల వెయిటేజీ కోసం ఎదురుచూసే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
- సప్లిమెంటరీ పరీక్షలతో పాటుగా, ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు తాము ఉత్తీర్ణత సాధించిన సబ్జెక్టుల్లో మార్కులను పెంచుకోవడానికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు.
- థియరీ పరీక్షలకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు మెరుగుపరుచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
- ఫెయిల్ అయిన విద్యార్థులు ఎన్ని సబ్జెక్టులైనా, వారు ఉత్తీర్ణత సాధించే వరకు పరిమితి లేకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు.
ఫీజు, దరఖాస్తు తేదీలు:
పరీక్షలు రాయదలచుకున్న విద్యార్థులు రూ.600 ప్రాథమిక ఫీజుతో పాటు, ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ పాత ఐడీ నంబరుతోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇంప్రూవ్మెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు నేటి నుంచి (ఏప్రిల్ 20) ఏప్రిల్ 27 వరకు గడువు విధించారు. ఈ సమాచారాన్ని విద్యార్థులందరికీ చేరవేసేలా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ తేదీలు…
{{/usCountry}}ఇంప్రూవ్మెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు నేటి నుంచి (ఏప్రిల్ 20) ఏప్రిల్ 27 వరకు గడువు విధించారు. ఈ సమాచారాన్ని విద్యార్థులందరికీ చేరవేసేలా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది.
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ తేదీలు…
{{/usCountry}}ఇంటర్ మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు మళ్లీ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరిస్తారు.
- దరఖాస్తు గడువు : ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రీకౌంటింగ్ (RC): మార్కులు సరిగ్గా లెక్కించారో లేదో తెలుసుకోవడానికి దీనిని ఎంచుకోవచ్చు.
- రీవెరిఫికేషన్ (RV): ఇందులో జవాబు పత్రాల స్కాన్ కాపీని విద్యార్థికి పంపిస్తారు. మొత్తం పేపర్ను మరోసారి పరిశీలిస్తారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు.