నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైన్స్ ఫిక్షన్ వండర్ 'కల్కి 2898 ఏడీ'. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ మైవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీ మొదటి భాగం రూ. 1042 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు అందరి దృష్టి దీని సీక్వెల్ పైనే ఉంది. అయితే నిర్మాతలు సీక్వెల్ గురించి మౌనం వహిస్తున్నా.. సోషల్ మీడియాలో వస్తున్న లీకులు మాత్రం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ మార్పు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
దీపికా స్థానంలో సాయి పల్లవి?

గతేడాది సెప్టెంబర్ లో దీపికా పదుకోన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు బలంగా వినిపించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని 'స్పిరిట్' సినిమాతో పాటు, 'కల్కి' సీక్వెల్ నుంచి కూడా ఆమె వైదొలిగింది. రెమ్యునరేషన్ పెంపు విషయంలో వచ్చిన విభేదాల కారణంగానే, సుమారు 20 రోజుల షూటింగ్ తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ను వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దీపిక పోషించిన సుమతి (SUM-80) పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవిని సంప్రదిస్తున్నారు. ఈ విషయంపై ఈ మూవీ టీమ్ కు చెందిన ఒక ప్రతినిధి స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.
"అధికారికంగా ఇంకా ఏదీ ఖరారు కాలేదు. కానీ దీపికా తప్పుకున్న తర్వాత సుమతి పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవిని పరిశీలిస్తున్న మాట వాస్తవమే. ఆ పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోతుందని వాళ్లు భావిస్తున్నారు" అని సదరు ప్రతినిధి హిందుస్థాన్ టైమ్స్ కు స్పష్టం చేశారు.
అయితే సాయి పల్లవిని ఇప్పటికే ఫైనల్ చేశారని, షూటింగ్ కూడా మొదలుకాబోతోందని వస్తున్న వార్తలను వారు ఖండించారు. "ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. దయచేసి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండండి" అని కోరారు.
సుమతి పాత్ర ప్రాధాన్యత ఏంటి?
మొదటి భాగంలో 'సుమతి' పాత్ర కథకు చాలా కీలకం. ఆమె ప్రాజెక్ట్-కెలో ప్రయోగాలకు గురైన గర్భిణిగా, భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారానికి తల్లిగా కనిపిస్తుంది. విశేషమేమిటంటే తెలుగు వెర్షన్లో దీపిక పాత్రకు శోభితా ధూళిపాళ్ల డబ్బింగ్ చెప్పింది. కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ ల్యాబ్ నుంచి తప్పించుకున్న సుమతి.. అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సంరక్షణలోకి వెళుతుంది.
{{/usCountry}}మొదటి భాగంలో 'సుమతి' పాత్ర కథకు చాలా కీలకం. ఆమె ప్రాజెక్ట్-కెలో ప్రయోగాలకు గురైన గర్భిణిగా, భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారానికి తల్లిగా కనిపిస్తుంది. విశేషమేమిటంటే తెలుగు వెర్షన్లో దీపిక పాత్రకు శోభితా ధూళిపాళ్ల డబ్బింగ్ చెప్పింది. కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ ల్యాబ్ నుంచి తప్పించుకున్న సుమతి.. అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) సంరక్షణలోకి వెళుతుంది.
{{/usCountry}}సినిమా క్లైమాక్స్ లో భైరవ (ప్రభాస్).. గర్భిణిగా ఉన్న సుమతిని తీసుకుని పారిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. ఇదే సమయంలో భైరవ మరెవరో కాదు, తన మిత్రుడు కర్ణుడి పునర్జన్మ అని అశ్వత్థామ గుర్తిస్తాడు. మరోవైపు సుమతి గర్భస్థ శిశువు సీరం ద్వారా శక్తిని పొందిన యాస్కిన్.. స్వయంగా సుమతిని పట్టుకోవడానికి బయలుదేరతాడు. ఈ నేపథ్యంలో సీక్వెల్ లో సుమతి పాత్ర నిడివి, ప్రాధాన్యత ఇంకా ఎక్కువగా ఉండబోతోంది. ఇలాంటి బరువైన పాత్రను సాయి పల్లవి ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి.