తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె ఉన్న కుటుంబాల్లో ఆడపిల్లల విద్యను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. 'మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్' పేరుతో పదో తరగతి తర్వాత పైచదువులకు బోర్డు ఆర్థిక భరోసా ఇస్తోంది. 2025లో 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరు అర్హులు?

ఈ పథకం కింద 'సింగిల్ గర్ల్ చైల్డ్' అంటే తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే సంతానమై ఉండాలి. తోబుట్టువులు (అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు) ఉండకూడదు. ఒకవేళ కవలలు ఇద్దరూ ఆడపిల్లలే అయితే, వారిద్దరినీ కూడా ఈ పథకానికి అర్హులుగానే పరిగణిస్తారు.
ముఖ్యమైన నిబంధనలు ఇవే:
మార్కులు: పదో తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.
చదువు: ప్రస్తుతం సీబీఎస్ఈ గుర్తింపు పొందిన స్కూల్లో 11 లేదా 12వ తరగతి చదువుతుండాలి.
ట్యూషన్ ఫీజు: విద్యార్థిని చదువుతున్న స్కూల్లో నెలకు ట్యూషన్ ఫీజు రూ. 1,500 (10వ తరగతిలో) మించకూడదు. అలాగే 11, 12 తరగతుల్లో ఫీజు నెలకు రూ. 3,000 లోపు ఉండాలి. (ఎన్ఆర్ఐ విద్యార్థులకైతే గరిష్టంగా నెలకు రూ. 6,000 వరకు ఉండొచ్చు).
ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. దీనికి సంబంధించి నోటరీ చేయించిన అఫిడవిట్ను సమర్పించాల్సి ఉంటుంది.
స్కాలర్షిప్ మొత్తం ఎంత?
ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ. 1,000 చొప్పున రెండేళ్ల పాటు (11, 12 తరగతులు) ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థిని బ్యాంక్ ఖాతాకే (ఈసీఎస్/ నెఫ్ట్ ద్వారా) జమ చేస్తారు.
పాత విద్యార్థులకు రెన్యూవల్ అవకాశం..
గతేడాది ఈ స్కాలర్షిప్ పొందిన వారు ఈ ఏడాది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు 11వ తరగతిలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 12వ తరగతికి ప్రమోట్ అయి ఉండాలి.
దరఖాస్తు విధానం..
{{/usCountry}}గతేడాది ఈ స్కాలర్షిప్ పొందిన వారు ఈ ఏడాది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వారు 11వ తరగతిలో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, 12వ తరగతికి ప్రమోట్ అయి ఉండాలి.
దరఖాస్తు విధానం..
{{/usCountry}}అర్హత ఉన్న విద్యార్థినులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ (cbse.gov.in) లోని స్కాలర్షిప్ సెక్షన్కు వెళ్లి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కావాల్సిన పత్రాలు:
స్కూల్ ప్రిన్సిపాల్ ధృవీకరించిన మొదటి త్రైమాసిక ఫీజు రసీదు.
ఆదాయ ధృవీకరణ పత్రం
పదో తరగతి మార్కుల జాబితా.
దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత పాఠశాల యాజమాన్యం ఆ వివరాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది. గడువు ముగియక ముందే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని బోర్డు సూచించింది. ఒకవేళ పేమెంట్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే సీబీఎస్ఈ స్కాలర్షిప్ విభాగాన్ని సంప్రదించవచ్చు.
ఆడపిల్లల చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర బోర్డు చేపట్టిన ఈ చొరవ ఎంతోమంది మెరిట్ విద్యార్థినులకు వరంగా మారనుంది.