...
...
Next Story

రెనాల్ట్​ ట్రైబర్​ ఆధారంగా నిస్సాన్​ గ్రావిటే- ఈ 7 సీటర్​ ఎంపీవీ ఎలా ఉండబోతోంది?

భారత మార్కెట్లో నిస్సాన్ తన పట్టును పెంచుకునేందుకు సిద్ధమైంది. రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా రూపొందిస్తున్న కొత్త 7-సీటర్ ఎంపీవీ 'గ్రావిటే'ని 2026 ప్రారంభంలో లాంచ్ చేయనుంది. మరి ఇది ట్రైబర్​లానే ఉంటుందా? లేక ఎంపీవీలో మార్పులు కనిపిస్తాయా?

Published on: Dec 22, 2025 06:12 AM IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది జపాన్ దిగ్గజం నిస్సాన్. ఇందులో భాగంగా మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, రెనాల్ట్​ ట్రైబర్​ ఆధారిత, సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ ‘గ్రావిటే’ని పరిచయం చేయబోతోంది. 2026 మార్చి నాటికి ఈ కారు షోరూమ్‌లలో సందడి చేసే అవకాశం ఉంది. మరి ఇది కేవలం రెనాల్ట్​ ట్రైబర్​కి రీబ్యాడ్జ్​ వర్షెన్​గా మిగిలిపోతుందా? లేదా ఇందులో కొత్తగా ఏమైనా ఉంటాయా?

నిస్సాన్​ గ్రావిటే- జనవరి 21న గ్రాండ్ ఎంట్రీ!

నిస్సాన్​ గ్రావిటే ఎంపీవీ..
నిస్సాన్​ గ్రావిటే ఎంపీవీ..

వచ్చే ఏడాది జనవరి 21న 'గ్రావిటే' ఎంపీవీని ప్రపంచానికి అధికారికంగా పరిచయం చేయనుంది నిస్సాన్. ఈ ఎంపీవీ తర్వాత 2026 మధ్యలో 'టెక్టాన్' ఎస్‌యూవీని, ఆపై 2027లో మరో భారీ 7-సీటర్ ఎస్‌యూవీని తీసుకురావాలని కంపెనీ పక్కా ప్రణాళికతో ఉంది.

ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదల చేసిన గ్రావిటే టీజర్లు.. ఈ ఎంపీవీపై ఆసక్తిని పెంచుతున్నాయి.

డిజైన్‌లో కొత్తదనం.. రెనాల్ట్ ట్రైబర్‌కు వారసుడిగా!

కొత్త ఎంపీవీ ముందు, వెనుక డిజైన్​లను చూస్తే ఇది రెనాల్ట్​ ట్రైబర్​ రీబ్యాడ్జ్​ వర్షెన్​ అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ స్టైలింగ్​ని మాత్రం కాస్త మార్చింది. ముఖ్యంగా ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. బంపర్ వద్ద 'సీ' ఆకారపు ట్రిమ్స్ కారు వెడల్పుగా కనిపించేలా చేస్తున్నాయి. వెనుక వైపు 'గ్రావిటే' అనే పేరు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు.

  • టెక్టాన్​ నుంచి 7 సీటర్​ ఎస్​యూవీ వరకు- నిస్సాన్​ నుంచి రాబోతున్న క్రేజీ కార్లుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

లోపల అంతా విలాసం.. ఫీచర్లు ఇవే!

నిస్సాన్​ గ్రావిటేలో కొన్ని ప్రధాన ఫీచర్లు ఇలా ఉన్నాయి:

7-ఇంచ్​ టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 8-ఇంచ్​ టచ్‌స్క్రీన్.

వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కూల్డ్ స్టోరేజ్ బాక్స్.

రెండో వరుసలో స్లైడింగ్, రీక్లైన్ చేసుకునే సౌకర్యం ఉన్న సీట్లు.

చిన్న కారే అయినప్పటికీ, ఏడుగురు ప్రయాణించడానికి వీలుగా దీనిని తీర్చిదిద్దారు! అయితే, మూడొవ వరుసలో స్పేస్​ పరిమితంగానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉంటుంది?

నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ ఇంజిన్ వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఇందులో 1.0 లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 72 హెచ్​పీ పవర్‌ను, 96 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఇది లభించనుంది. భారతీయ రోడ్లకు అనుగుణంగా నిస్సాన్ ఈ ఇంజిన్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు చేయవచ్చని సమాచారం.

మొత్తానికి, బడ్జెట్ ధరలో ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి నిస్సాన్ గ్రావిటీ ఒక మంచి ఎంపిక కానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe